మరో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో హైదరాబాద్ లోని బాబు నివాసానికి అధికారులు చేరుకున్నారు. వాహనాల్లో వెళ్లిన వారు.. చంద్రబాబును కలవాలని చెప్పారు. అందుకు బాబు భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లుగా బాబుకు సమాచారం ఇవ్వటం.. ఆయన లోపలకు పంపాలని చెప్పటంతో సదరు అధికారుల్ని లోపలకు అనుమతించారు.
రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ అధికారులు వచ్చినట్లుగా చెబుతున్నారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. నోటీసులు అందించిన తర్వాత విచారణకు పిలుస్తామని అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ విపక్ష తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైన వేళ.. పార్టీ వర్గాలన్ని నిరాశలో కూరుకుపోయిన సమయంలోనే బాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కేలా చేశాయని చెబుతున్నారు.
This post was last modified on March 16, 2021 10:10 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…