టీడీపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్రను సొంతం చేసుకున్న నాయకుడు, చంద్రబాబు తర్వాత.. నెంబర్ 2గా వ్యవహరించే నేత.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వ్యూహాలు.. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆయనను మించిన నాయకుడు లేరని ఒక ప్పుడు టాక్. అయితే.. ఆయన కొన్నేళ్లుగా వైట్ ఎలిఫెంట్
గా మారిపోయారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం నుంచి అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ లోకి వచ్చిన యనమల.. స్పీకర్గా, మంత్రిగా.. పార్టీలో అనేక పదవులు వ్యవహరించారు.
తుని నుంచి పలుమార్లు విజయం సాధించి.. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా మలిచారు. పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికల నుంచి 2004 వరకు కూడా వరుస విజయాలు సాధించారు. తిరుగేలేని నేతగా ఆయన వ్యవహరించారు. అయితే.. 2009లో మాత్రం త్రిముఖ పోటీ.. వైఎస్ హవాతో యనమల తొలిసారి ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక, ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి ఆయన తప్పుకొని ఆయన సొదరుడుకు ఇక్కడ టికెట్ ఇప్పించుకున్నారు. ఇక, ఈయన కూడా వరుస పరాజయాలు చవిచూశారు. అయినప్పటికీ.. తునిలో యనమల సోదరులు హవా చలాయిస్తూనే ఉన్నారు. తమ వ్యాపారాలు.. వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే ఉన్నారు.
అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం టీడీపీని గట్టెక్కించలేక పోయారు. కనీసం.. గౌరవ ప్రదమైన స్థానాలను కైవసం చేసుకోవడం మాట అటుంచితే.. పార్టీకి ఉనికి కూడా లేకుండా పోయేలా వ్యవహరించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ తుని మునిసిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానిలోనూ టీడీపీ విజయం సాధించలేదు. మొత్తం గుండుగుత్తుగా వైసీపీ తన ఖాతాలో వేసుకుని.. సంచలన విజయం నమోదు చేయడం గమనార్హం.
అయితే.. టీడీపీ విజయం సాధించలేకపోవడానికి యనమల సోదరులు అనుసరించిన వైఖరే కారణమని టీడీపీలో నేతలు బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. తమను పట్టించుకోలేదని.. వారు అంటున్నారు. అదేసమయంలో పార్టీ అధిష్టానం ముందు.. అన్నీ తాను చూసుకుంటున్నానని చెప్పన యనమల తర్వాత చేతులు ఎత్తేశారని.. కూడా ఇక్కడి అభ్యర్థులు వాపోతున్నారు. మొత్తంగా చూస్తే.. యనమల సోదరులు తునిని తునాతునకలు చేశారనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on March 15, 2021 10:18 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…