మన టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో ఏవి ఏ పార్టీలకు అనుకూలమో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని ఛానెళ్లు, పత్రికలు నేరుగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్నేమో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆ ఛానెళ్ల మీద ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. వాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు.
ఇక కొడాలి నాని లాంటి వాళ్లయితే ఆ ఛానెళ్లను ఎలా టార్గెట్ చేస్తారో తెలిసిందే. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటే ఆయనకు అస్సలు గిట్టదు. ఎన్నోసార్లు ఆ ఛానెల్ మీద విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తి ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏబీఎన్కు, టీవీ5కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ఛానెళ్లను పొగిడారు. ఇవి ఇదే పనితీరును కొనసాగించాలని కోరుకున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఆ సంగతేంటో చూద్దాం పదండి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తున్నామన్న ఆలోచనతో ఆయన్ని, ఆయన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
‘‘చంద్రబాబుకు మేలు చేస్తున్నామన్న ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి.. చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి.. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టించేదాకా.. ఏబీఎన్ రాధాకృష్ణగానీ.. టీవీ5 బీఆర్ నాయుడు కానీ నిద్ర పోకుండా.. వీళ్లిద్దరూ కృషి చేయాలని కోరుకుంటూ.. ఈ రోజు మేం సాధించిన విజయానికి మీరు అందించిన తోడ్పాటుకు మీకు, మీ ఛానెల్స్కు, మీ ఛానెల్స్లో వచ్చిన అపర మేధావులకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ వెటకారం ఆడారు మంత్రి కొడాలి నాని.
This post was last modified on March 15, 2021 3:41 pm
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…
ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా అందుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను ప్రభుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…