మన టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో ఏవి ఏ పార్టీలకు అనుకూలమో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని ఛానెళ్లు, పత్రికలు నేరుగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్నేమో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆ ఛానెళ్ల మీద ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. వాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు.
ఇక కొడాలి నాని లాంటి వాళ్లయితే ఆ ఛానెళ్లను ఎలా టార్గెట్ చేస్తారో తెలిసిందే. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటే ఆయనకు అస్సలు గిట్టదు. ఎన్నోసార్లు ఆ ఛానెల్ మీద విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తి ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏబీఎన్కు, టీవీ5కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ఛానెళ్లను పొగిడారు. ఇవి ఇదే పనితీరును కొనసాగించాలని కోరుకున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఆ సంగతేంటో చూద్దాం పదండి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తున్నామన్న ఆలోచనతో ఆయన్ని, ఆయన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
‘‘చంద్రబాబుకు మేలు చేస్తున్నామన్న ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి.. చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి.. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టించేదాకా.. ఏబీఎన్ రాధాకృష్ణగానీ.. టీవీ5 బీఆర్ నాయుడు కానీ నిద్ర పోకుండా.. వీళ్లిద్దరూ కృషి చేయాలని కోరుకుంటూ.. ఈ రోజు మేం సాధించిన విజయానికి మీరు అందించిన తోడ్పాటుకు మీకు, మీ ఛానెల్స్కు, మీ ఛానెల్స్లో వచ్చిన అపర మేధావులకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ వెటకారం ఆడారు మంత్రి కొడాలి నాని.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…