మన టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో ఏవి ఏ పార్టీలకు అనుకూలమో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని ఛానెళ్లు, పత్రికలు నేరుగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్నేమో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆ ఛానెళ్ల మీద ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. వాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు.
ఇక కొడాలి నాని లాంటి వాళ్లయితే ఆ ఛానెళ్లను ఎలా టార్గెట్ చేస్తారో తెలిసిందే. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటే ఆయనకు అస్సలు గిట్టదు. ఎన్నోసార్లు ఆ ఛానెల్ మీద విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తి ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏబీఎన్కు, టీవీ5కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ఛానెళ్లను పొగిడారు. ఇవి ఇదే పనితీరును కొనసాగించాలని కోరుకున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఆ సంగతేంటో చూద్దాం పదండి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తున్నామన్న ఆలోచనతో ఆయన్ని, ఆయన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
‘‘చంద్రబాబుకు మేలు చేస్తున్నామన్న ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి.. చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి.. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టించేదాకా.. ఏబీఎన్ రాధాకృష్ణగానీ.. టీవీ5 బీఆర్ నాయుడు కానీ నిద్ర పోకుండా.. వీళ్లిద్దరూ కృషి చేయాలని కోరుకుంటూ.. ఈ రోజు మేం సాధించిన విజయానికి మీరు అందించిన తోడ్పాటుకు మీకు, మీ ఛానెల్స్కు, మీ ఛానెల్స్లో వచ్చిన అపర మేధావులకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ వెటకారం ఆడారు మంత్రి కొడాలి నాని.
This post was last modified on March 15, 2021 3:41 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…