Political News

మూడు రాజధానులకు అంగీకరించినట్లేనా ?

తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మూడు రాజధానులకు ఆమోదం తెలిపినట్లే భావించాలి. విజయవాడ, గుంటూరులో ప్రచారం చేసినపుడు అమరావతి సెంటిమెంటును కాపాడుకోవాలంటే టీడీపీకే ఓట్లేయాలని చంద్రబాబునాయుడు జనాలను ఆదేశించారు. మామూలుగా అయితే ఓట్లేయండని అభ్యర్ధిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం విచిత్రంగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో జనాలను బాగా తిట్టిపోశారు.

టీడీపీకి ఎందుకు ఓట్లేయరో చెప్పాలన్నారు. సిగ్గులేదా శరం లేదా రోషం లేదా పౌరుషం లేదా అంటు నోటికొచ్చినట్లు మాట్లాడారు. వైసీపీకి ఓట్లేస్తే రాజధానిని అమరావతి నుండి తరలించటానికి అంగీకారం తెలిపినట్లవుతుందని లాజిక్ లేవదీశారు. చంద్రబాబు ఏమి చెప్పినా జనాలు మాత్రం వైసీపీనే గెలిపించారు. అలాగే విజయవాడ కార్పొరేషన్లో కూడా వైసీపీదే విజయం.

అంటే రాజధానిని అమరావతి నుండి తరలించటానికి చంద్రబాబు భాషలోనే జనాలు ఆమోదం తెలిపినట్లు అనుకోవాలి. కార్పొరేషన్లు సరే కనీసం రాజధాని జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటిలో కూడా టీడీపీని గెలిపించలేదు. ఇదే సమయంలో కర్నూలు, వైజాగ్ కార్పొరేషన్లలో కూడా వైసీపీనే ఘన విజయం సాధించింది. దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనాలు ఆమోదం లభించినట్లే అనుకోవాలి.

అయితే ఇప్పటికే మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉంది కాబట్టి సాంకేతికంగా తరలించేందుకు లేదు. కానీ జగన్ మాత్రం వైజాగ్ వెళ్ళిపోవటం ఖాయమని తేలిపోయింది. తొందరలోనే జగన్ అమరావతిని వదిలిపెట్టేసి వైజాగ్ వెళ్ళిపోవటానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నైతికంగా మద్దతుగా నిలిచిందనే అనుకోవాలి. కాబట్టి జగన్ వైజాగ్ వెళ్ళటానికి ఇక ఎంతో కాలం పట్టదు. అప్పుడు చంద్రబాబు అండ్ కో నోరెత్తటానికి కూడా లేదు. ఎందుకంటే రాజదాని తరలింపును చంద్రబాబే రెఫరెండంగా అభివర్ణించారు కాబట్టి.

This post was last modified on March 15, 2021 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago