Political News

మూడు రాజధానులకు అంగీకరించినట్లేనా ?

తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మూడు రాజధానులకు ఆమోదం తెలిపినట్లే భావించాలి. విజయవాడ, గుంటూరులో ప్రచారం చేసినపుడు అమరావతి సెంటిమెంటును కాపాడుకోవాలంటే టీడీపీకే ఓట్లేయాలని చంద్రబాబునాయుడు జనాలను ఆదేశించారు. మామూలుగా అయితే ఓట్లేయండని అభ్యర్ధిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం విచిత్రంగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో జనాలను బాగా తిట్టిపోశారు.

టీడీపీకి ఎందుకు ఓట్లేయరో చెప్పాలన్నారు. సిగ్గులేదా శరం లేదా రోషం లేదా పౌరుషం లేదా అంటు నోటికొచ్చినట్లు మాట్లాడారు. వైసీపీకి ఓట్లేస్తే రాజధానిని అమరావతి నుండి తరలించటానికి అంగీకారం తెలిపినట్లవుతుందని లాజిక్ లేవదీశారు. చంద్రబాబు ఏమి చెప్పినా జనాలు మాత్రం వైసీపీనే గెలిపించారు. అలాగే విజయవాడ కార్పొరేషన్లో కూడా వైసీపీదే విజయం.

అంటే రాజధానిని అమరావతి నుండి తరలించటానికి చంద్రబాబు భాషలోనే జనాలు ఆమోదం తెలిపినట్లు అనుకోవాలి. కార్పొరేషన్లు సరే కనీసం రాజధాని జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటిలో కూడా టీడీపీని గెలిపించలేదు. ఇదే సమయంలో కర్నూలు, వైజాగ్ కార్పొరేషన్లలో కూడా వైసీపీనే ఘన విజయం సాధించింది. దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనాలు ఆమోదం లభించినట్లే అనుకోవాలి.

అయితే ఇప్పటికే మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉంది కాబట్టి సాంకేతికంగా తరలించేందుకు లేదు. కానీ జగన్ మాత్రం వైజాగ్ వెళ్ళిపోవటం ఖాయమని తేలిపోయింది. తొందరలోనే జగన్ అమరావతిని వదిలిపెట్టేసి వైజాగ్ వెళ్ళిపోవటానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నైతికంగా మద్దతుగా నిలిచిందనే అనుకోవాలి. కాబట్టి జగన్ వైజాగ్ వెళ్ళటానికి ఇక ఎంతో కాలం పట్టదు. అప్పుడు చంద్రబాబు అండ్ కో నోరెత్తటానికి కూడా లేదు. ఎందుకంటే రాజదాని తరలింపును చంద్రబాబే రెఫరెండంగా అభివర్ణించారు కాబట్టి.

This post was last modified on March 15, 2021 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

50 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago