Political News

హైదరాబాద్ కు తాడిపత్రి పాలిట్రిక్స్.. అర్థరాత్రి సీక్రెట్ గా తరలింపు

ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలన్ని ఒక ఎత్తు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన ఎన్నిక ఒక ఎత్తుగా చెప్పాలి. ఎందుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయ గుర్తింపు ఉన్న జేసీ కుటుంబానికి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నిక.. వారు కోరుకున్నట్లే సానుకూల ఫలితం వచ్చినా.. అధిక్యత త్రుటితో తప్పింది. దీంతో.. ఎవరైతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారో వారే తాడిపత్రి మున్సిపాల్టీని సొంతం చేసుకునే వీలుంది. దీంతో.. స్పందించిన జేసీ సోదరులు ఆదివారం అర్థరాత్రి.. తమ వర్గానికి చెందిన కౌన్సిలర్లను తీసుకొని హైదరాబాద్ కు వచ్చినట్లుగా చెబుతున్నారు.

తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉంటే.. టీడీపీ 18 వార్డుల్లో.. వైసీపీ 16 వార్డుల్లో విజయం సాధించింది. సీపీఐ ఒకటి.. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. దీంతో.. తమ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లను రహస్య ప్రదేశానికి తరలించారు. అధికార వైసీపీ వారు తమ పార్టీ వారిని ప్రలోభాలకు గురి చేస్తారన్న ఆలోచనతో ఎవరికి తెలియని ప్రదేశానికి జేసీ సోదరులు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.

తమ కౌన్సిలర్లను వైసీపీ నేతలు బెదిరించి… భయపెడతారన్న అనుమానంతోనే ఇలా చేసినట్లుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాడిపత్రి రాజకీయం హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. కౌన్సిలర్లను తీసుకొని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. జేసీ పవన్ రెడ్డిలు హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తాడిపత్రి రాజకీయం రానున్న రోజుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతుందని చెప్పక తప్పదు.

This post was last modified on March 15, 2021 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

5 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

6 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

6 hours ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

9 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

9 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

10 hours ago