Political News

నియోజ‌క‌వ‌ర్గంలో ఆ ఎంపీ ఎక్క‌డ‌?.. ప్ర‌జ‌లు ల‌బోదిబో!!

కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీప‌ట్నం. ఇక్క‌డ నుంచి 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ విజ‌యం సాధించారు. పార్ల‌మెంటులో మ‌చిలీప‌ట్నం పోర్టు స‌హా అనేక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించి.. ప‌రిష్క‌రించేందుకు కృషి చేశారు. అయితే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ స‌హా.. అధికార టీడీపీకి ప్ర‌జ‌లు దూరం కావ‌డంతో కొన‌క‌ళ్ల నారాయ‌ణ ఓడిపోయారు. ఇక‌, ఇక్క‌డ నుంచి బాల శౌరి.. వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అయితే.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించింది లేద‌నేది ఇక్క‌డి వారి మాట‌.

2019 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత‌.. బాల‌శౌరి ఒక‌టి రెండు సార్లు త‌ప్ప‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకున్న‌ది లేద‌ని కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. క‌రోనాకు ముందు.. త‌ర్వాత కూడా.. ఢిల్లీలోనే మ‌కాం వేసిన‌.. బాల‌శైరి.. కేవలం సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల కోస‌మే ప‌నిచేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న ఏపీకి వ‌చ్చినా.. తాడేప‌ల్లిలో మ‌కాం వేసి.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి.. మ‌ళ్లీ తిరుగుట‌పాలో ఢిల్లీకి వెళ్లిపోతున్నారు. అంతేత‌ప్ప‌.. పార్ల‌మెంటు ప‌రిధిలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ఆయ‌న ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు.

దీంతో ఇప్పుడు మ‌చిలీప‌ట్నంలో మా ఎంపీగారు ఎక్కడ‌? అనే వారు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. అయితే.. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోందా? అంటే.. అది కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. మంత్రి పేర్నినాని దూకుడుతో టీడీపీ వ‌ర్గాలు సైలెంట్ అవుతున్నాయి. ఏం చేస్తే.. ఎలాంటి ఇబ్బంది వ‌స్తుందోన‌ని నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేవారు క‌రువ‌య్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. మ‌రి ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌శౌరికి ఇక్క‌డ ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 14, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి..…

39 minutes ago

వద్దే వద్దంటున్న అజిత్ ఫ్యాన్స్

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో…

2 hours ago

జననాగయన్… విజయ్ కీలక నిర్ణయం?

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. తమిళ టాప్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ విడుదలై ఆరు వారాలు…

2 hours ago

కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా…

3 hours ago

బలవంత్ బిజినెస్ వర్కౌట్ అయ్యిందా

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ప్రమోషన్ల పరంగా బాగా హడావిడి చేసింది హే బలవంత్ ఒక్కటే. మిగిలినవి కూడా పబ్లిసిటీ…

4 hours ago

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…

5 hours ago