Political News

కరోనా దెబ్బ మామూలుగా లేదుగా !

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ స్ధాయిలో వణికించేసిందో అందరు చూస్తున్నదే. యావత్ ప్రపంచం ఎలా దెబ్బతిన్నదో మనదేశం కూడా అంతే స్ధాయిలో దెబ్బతింది. తాజాగా కేంద్రప్రభుత్వంలోని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశం మొత్తంమీద 10 వేల కంపెనీలు మూతపడ్డాయట. కరోనా వైరస్ దెబ్బకు తట్టుకోలేక 10113 కంపెనీలు స్వచ్చంధంగానే మూతపడ్డాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక కార్యకలాపాల మీద తీవ్రంగా దెబ్బ పడింది. పరిశ్రమలు, టూరిజం, హోటల్, వర్తక, వాణిజ్య రంగాలకు చెందిన వేలాది పరిశ్రమలపై చావు దెబ్బ పడింది. మూతపడిన పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయంతో సంబంధం లేకుండానే వాటి యాజమాన్యాలు స్వచ్చంధంగానే మూత వేసేశారు. అత్యధికంగా ఢిల్లీలో 2394 కంపెనీలు మూతపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లో 1936 కంపెనీలు మూతపడ్డాయి.

తమిళనాడులో 1322, మహారాష్ట్రంలో 1279, కర్ణాటకలో 836, చండీఘడ్ లో 501, రాజస్ధాన్ లో 479, తెలంగాణాలో 404, కేరళలో 307, ఝార్ఖండ్ లో 137, మధ్యప్రదేశ్ లో 111, బీహార్లో 104 కంపెనీలు స్వచ్చంధంగా మూతపడ్డాయట. కరోనా వైరస్ కారణంగా తమంతట తాముగా కార్యకలాపాలను నిలిపేసిన కంపెనీల జాబితాను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంతో పై విషయాలు బయటపడ్డాయి.

కేంద్రం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారమే 10113 కంపెనీలు, ఫ్యాక్టరీలు మూత పడ్డాయటంటే అందులోని ఉద్యోగుల సంఖ్యే లక్షల్లో ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక పరోక్షంగా ఉపాధి పొందుతున్న వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. అమెరికాలో సుమారు 3 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి పోగొట్టుకున్నారని చెప్పుకున్నాం. మన దేశంలో ఎంతమంది ఉద్యోగ, ఉపాధి పోగొట్టుకున్నారనే విషయంలో స్పష్టత లేదు.

This post was last modified on March 12, 2021 9:37 am

Share
Show comments
Published by
Satya
Tags: CoronaIndia

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

24 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago