ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ స్ధాయిలో వణికించేసిందో అందరు చూస్తున్నదే. యావత్ ప్రపంచం ఎలా దెబ్బతిన్నదో మనదేశం కూడా అంతే స్ధాయిలో దెబ్బతింది. తాజాగా కేంద్రప్రభుత్వంలోని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశం మొత్తంమీద 10 వేల కంపెనీలు మూతపడ్డాయట. కరోనా వైరస్ దెబ్బకు తట్టుకోలేక 10113 కంపెనీలు స్వచ్చంధంగానే మూతపడ్డాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక కార్యకలాపాల మీద తీవ్రంగా దెబ్బ పడింది. పరిశ్రమలు, టూరిజం, హోటల్, వర్తక, వాణిజ్య రంగాలకు చెందిన వేలాది పరిశ్రమలపై చావు దెబ్బ పడింది. మూతపడిన పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయంతో సంబంధం లేకుండానే వాటి యాజమాన్యాలు స్వచ్చంధంగానే మూత వేసేశారు. అత్యధికంగా ఢిల్లీలో 2394 కంపెనీలు మూతపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లో 1936 కంపెనీలు మూతపడ్డాయి.
తమిళనాడులో 1322, మహారాష్ట్రంలో 1279, కర్ణాటకలో 836, చండీఘడ్ లో 501, రాజస్ధాన్ లో 479, తెలంగాణాలో 404, కేరళలో 307, ఝార్ఖండ్ లో 137, మధ్యప్రదేశ్ లో 111, బీహార్లో 104 కంపెనీలు స్వచ్చంధంగా మూతపడ్డాయట. కరోనా వైరస్ కారణంగా తమంతట తాముగా కార్యకలాపాలను నిలిపేసిన కంపెనీల జాబితాను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంతో పై విషయాలు బయటపడ్డాయి.
కేంద్రం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారమే 10113 కంపెనీలు, ఫ్యాక్టరీలు మూత పడ్డాయటంటే అందులోని ఉద్యోగుల సంఖ్యే లక్షల్లో ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక పరోక్షంగా ఉపాధి పొందుతున్న వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. అమెరికాలో సుమారు 3 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి పోగొట్టుకున్నారని చెప్పుకున్నాం. మన దేశంలో ఎంతమంది ఉద్యోగ, ఉపాధి పోగొట్టుకున్నారనే విషయంలో స్పష్టత లేదు.
This post was last modified on March 12, 2021 9:37 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…