పశ్చిమ బెంగాల్లో అప్పుడో నందిగ్రామ్ చిచ్చు మొదలైపోయింది. నామినేషన్ దాఖలు సందర్భంగా మమతపై దాడి జరిగిందనే ప్రచారంతోనే ఉద్రక్తితలు ఒక్కసారిగా పెరిగిపోయింది. బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఒకఎత్తు, మిగిలిన 293 నియోజకవర్గాలు ఒకఎత్తు. నందిగ్రామ్ ఎందుకింత చర్చల్లో నడుస్తోందంటే అందుకు మమతాబెనర్జీ-సుబేందు అధికారే కారణమని చెప్పాలి.
దశాబ్దాలుగా సుబేందు అధికారి కుటుంబానిదే నందిగ్రామ్ ప్రాంతంలో ఆధిపత్యం. ఈ ప్రాంతంలోని సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుబేందు కుటుంబానికి తిరుగులేని పట్టుంది. ఇలాంటి ప్రాంతంలో సంవత్సరాలుగా మమతకు మద్దతుగా నిలిచిన సుబేందు హఠాత్తుగా బీజేపీలో చేరారు. అంటే మమతకు సంవత్సరాలుగా అత్యంత సన్నిహితునిగా ఉన్న సుబేందే ఇపుడు బద్ద వ్యతిరేకయ్యారు. పైగా దమ్ముంటే నందిగ్రామ్ లో పోటీ చేయాలని మమతను సుబేందు సవాలు చేశారు.
సవాలును స్వీకరిచింన మమత వెంటనే నందిగ్రామ్ లో పోటీ చేయటానికి డిసైడ్ అయిపోయారు. దాంతో ఒక్కసారిగా బెంగాలే కాకుండా యావత్ దేశం దృష్టిని నందిగ్రామ్ ఆకర్షించింది. మమత-సుబేందు ఇద్దరు నందిగ్రామ్ లో పోటీ చేస్తున్నారంటేనే హై ఓల్టేజీ టెన్షన్ మొదలైపోయింది. ఇలాంటి నియోజకవర్గంలో మమత మధ్యాహ్నం నామినేషన్ వేశారు. సాయంత్రం బహిరంగసభ జరగటానికి ముందు ఓ దేవాలయానికి వెళ్ళినపుడు ఆమెపై దాడి జరిగింది.
మమతపై జరిగిన దాడితో బెంగాల్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. తనపై కుట్ర జరిగిందని మమత ఆరోపించారు. మమత పై దాడి అన్నది తృణమూల్ కాంగ్రెస్ డ్రామా అంటు బీజేపీ కొట్టిపారేస్తోంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ ఆధ్వర్యంలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. మరి దాడి ఘటన మమత డ్రామానా లేకపోతే దీదీపై ఎవరైనా కుట్ర చేశారా అన్నది సస్పెన్సుగా మిగిలిపోయింది. మొత్తానికి బెంగాల్లో నందిగ్రామ్ చిచ్చు మొదలైందన్నది మాత్రం వాస్తవం. ఈ చిచ్చు చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
This post was last modified on March 11, 2021 3:06 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…