Political News

ఆంధ్రాలో కేటీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుపై గడిచి కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనకు ఎలాంటి ఫలితం రాని వేళ.. కేంద్రమంత్రి లోక్ సభలో విశాఖ ఉక్కును అమ్మేయటం తప్పించి మరో మార్గం లేదని తేల్చేసిన వేళ.. దిక్కుతోచని స్థితిలో ఉన్న విశాఖ వాసులకు సరికొత్త ఆశాకిరణంగా మారారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇవాళ విశాఖ ఉక్కు అవుతుంది. రేపు బీహెచ్ఈఎల్ అవుతుంది.. తర్వాత బయ్యారం అవుతుంది.. ఆ తర్వాత సింగరేణి అవుతుంది. ఈ తీరును తప్పు పట్టాల్సిందే. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతి తీసుకొని విశాఖకు వస్తాం.. మద్దతు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ ఉక్కును కాపాడుకోవటానికి జరుగుతున్న పోరాటానికి కేటీఆర్ మద్దతు ప్రకటించటంపై ఏపీలోని పలువురు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కేటీఆర్ మాటలకు జై కొడుతున్నారు. కేటీఆర్ ఫోటోలకు విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులతోపాటు.. అక్కడి ప్రజలు పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి పోరాడి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుందామని కోరుతున్నారు.

విశాఖ ఉక్కుకు మద్దతు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలోని వారికి కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. వస్తామంటేనే ఇంత స్పందన వచ్చిన వేళ.. ఇక.. విశాఖ టూరుకు కానీ బయలుదేరితే.. కేటీఆర్ అండ్ కో బ్రహ్మరథం పట్టటం ఖాయమని చెప్పక తప్పదు. మరి.. మాటల్లో చెప్పిన మాట కేటీఆర్ చేతల్లో చూపిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on March 11, 2021 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

1 hour ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago