ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుపై గడిచి కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనకు ఎలాంటి ఫలితం రాని వేళ.. కేంద్రమంత్రి లోక్ సభలో విశాఖ ఉక్కును అమ్మేయటం తప్పించి మరో మార్గం లేదని తేల్చేసిన వేళ.. దిక్కుతోచని స్థితిలో ఉన్న విశాఖ వాసులకు సరికొత్త ఆశాకిరణంగా మారారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇవాళ విశాఖ ఉక్కు అవుతుంది. రేపు బీహెచ్ఈఎల్ అవుతుంది.. తర్వాత బయ్యారం అవుతుంది.. ఆ తర్వాత సింగరేణి అవుతుంది. ఈ తీరును తప్పు పట్టాల్సిందే. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతి తీసుకొని విశాఖకు వస్తాం.. మద్దతు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ ఉక్కును కాపాడుకోవటానికి జరుగుతున్న పోరాటానికి కేటీఆర్ మద్దతు ప్రకటించటంపై ఏపీలోని పలువురు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కేటీఆర్ మాటలకు జై కొడుతున్నారు. కేటీఆర్ ఫోటోలకు విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులతోపాటు.. అక్కడి ప్రజలు పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి పోరాడి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుందామని కోరుతున్నారు.
విశాఖ ఉక్కుకు మద్దతు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలోని వారికి కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. వస్తామంటేనే ఇంత స్పందన వచ్చిన వేళ.. ఇక.. విశాఖ టూరుకు కానీ బయలుదేరితే.. కేటీఆర్ అండ్ కో బ్రహ్మరథం పట్టటం ఖాయమని చెప్పక తప్పదు. మరి.. మాటల్లో చెప్పిన మాట కేటీఆర్ చేతల్లో చూపిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on March 11, 2021 2:57 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…