పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీని ధీటుగా ఎదుర్కోవటానికి ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవౌ గంగూలీనే దిక్కుగా మారాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. గంగూలి అలియాస్ దాదా కు బీజేపీ పెద్దలతో బాగా సన్నిహిత సంబంధాలున్న విషయం యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. గంగూలీ కమలంపార్టీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నదే.
అయితే ఆమధ్య దాదాకు రెండుసార్లు గుండెపోటు రావటంతో డైరెక్టుగా బీజేపీలో చేరిక ఆలస్యమైంది. అనారోగ్య సమస్యలు తలెత్తకపోతే ఈపాటికే ప్రచారంలోనో లేకపోతే ఎక్కడి నుండో పోటీ చేస్తునో బిజీగా ఉండేవాడే అనటంలో సందేహం లేదు. అయితే గుండెపోటు వచ్చిన తర్వాత రెండుసార్లు స్టంటు వేసుకున్న తర్వాత ఇపుడు ఆరోగ్యంగానే ఉన్నారు. కాబట్టి గంగూలీని ముందుగా ప్రచారంలోకి దింపాలని బీజేపీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మమతను ఎదుర్కొనేందుకు బీజేపీకి ఇప్పటికీ దీటైన ప్రత్యర్ధి లేరా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే 29 మంది ఎంఎల్ఏలను, ఒక ఎంపితో పాటు అనేకమంది సీనియర్ నేతలను బీజేపీలోకి లాక్కున్నారు. వీరిలో నందిగ్రామ్ ప్రాంతంలో బలమైన పట్టున్న సుబేందు అధికారి లాంటి నేతలు కూడా ఉన్నారు. అయినా గంగూలీతో చర్చలు జరిపి ఒత్తిడి పెట్టి రంగంలోకి దింపాల్సిన అవసరం బీజేపీకి ఏమోచ్చింది ?
అంటే బీజేపీలో ఇపుడున్న నేతలు కానీ లేదా టీఎంసీ నుండి లాక్కున్న నేతలకు కానీ మమతను ఢీకొనే సత్తా లేదని నరేంద్రమోడి, అమిత్ షా భావిస్తున్నట్లే ఉన్నారు. ఇందుకే వెంటనే రంగంలోకి దిగాలంటూ దాదాతో పదే పదే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. మొత్తంమీద అగ్రనేతల వ్యవహారం చూస్తుంటే మమతను ఢీకొనే సత్తా బీజేపీలో లేరని డిసైడ్ అయినట్లు అర్ధమైపోతోంది. గంగూలీకి కూడా తన రాజకీయ ప్రవేశంపై డైరెక్టుగా ఏమీ చెప్పలేదు. తన జీవితంలో జరిగిన పరిణామాలన్నీ హఠాత్తుగా సంభవించినవే అని నర్మగర్భంగా చెప్పటం గమనార్హం.
This post was last modified on March 11, 2021 8:14 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…