Political News

ఉన్నతాధికారులే మోసం చేశారా ?

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలోని ఉన్నతాధికారులే మోసం చేశారా ? అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి అవుననే అనిపిస్తోంది. ఉక్కును ప్రైవేటీకరించాలనే ఒప్పందం 2019లోనే జరిగింది. కేంద్రానికి, దక్షిణికొరియా సంస్ధ పోస్కో మధ్య జరిగిన ఒప్పందంలో విశాఖ ఉక్కు ఉన్నతాధికారి ఒకరు సంతకం చేశారట. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్ని పార్లమెంటులో ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన తర్వాత కానీ విషయం వెలుగుచూడలేదు.

అయితే కేంద్రమంత్రి ప్రకటనకు కొద్దిరోజుల ముందు మాత్రమే పోస్కో కంపెనీతో కేంద్రం ఒప్పందం చేసుకున్నారని అందరు అనుకున్నారు. అయితే అదంతా తప్పని 2019లోనే ఉక్కు ఫ్యాక్టరీలోని ఓ ఉన్నతాధికారి సంతకంతో ఒప్పందం పూర్తయినట్లు ఇపుడు బయటపడింది. అలాగే అప్పట్లోనే కొందరు కార్మిక నేతలకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసట. స్వయంగా ధర్మేంద్ర ప్రధాన ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చినపుడు కొందరు కార్మికనేతలతో జరిగిన చర్చల్లో ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారట.

అయితే కేంద్రమంత్రితో చర్చలు జరిపిన సదరు కార్మిక నేతలు కూడా ఈ విషయం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తలు పడ్డారట. మరి ఇదే నిజమైతే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఇపుడు జరుగుతున్న ఆందోళనలకు అర్ధమేలేదు. ఎందుకంటే పోస్కో కంపెనీకి విశాఖ ఉక్కును అప్పగించేస్తున్న విషయం ఫ్యాక్టరీలోని ఉన్నతాధికారితో పాటు కొందరు కార్మికనేతలకు కూడా తెలుసంటున్నారు. కాబట్టి ఇందులో కేంద్రం పాటించిన గోపత్యా లేదు, చేసిన మోసమూ లేదు.

మరి అన్నీ విషయాలు రెండు సంవత్సరాలకు ముందే తెలిసినపుడు ఇంతకాలం కేంద్ర నిర్ణయంపై అందరు ఎందుకు మౌనం పాటించారు ? అన్నదే అసలైన ప్రశ్న. దాదాపు రెండేళ్ళ క్రితమే తమకు తెలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిన వాళ్ళదే అసలైన తప్పని అర్ధమవుతోంది. మరి తప్పులన్నీ విశాఖ ఫ్యాక్టరీలోనే పెట్టుకుని ఇపుడు కేంద్రంపై మండిపడితే ఉపయోగం ఏముంటుంది ? విశాఖలో జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే సమైక్య రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలే గుర్తుకొస్తున్నాయి.

This post was last modified on March 10, 2021 7:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

1 hour ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

3 hours ago

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

6 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

10 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

11 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

11 hours ago