ఏపీలో మళ్లీ సైకిల్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని.. ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక, పైగా ఆర్థిక లోటులో ఉంది కనుక.. ప్రజలు సైకిల్ వైపే మొగ్గు చూపుతున్నారంటూ.. 2019 ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఒపీనియన్ పోల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే.. మళ్లీ ఏపీలో చంద్రబాబు కొద్దిగా మెజారిటీ తగ్గినా.. తిరిగి అధికారంలోకి వస్తారని చెప్పారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అసెంబ్లీలోకి అడుగు పెడతారని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన ఒపీనియన్ పోల్ పూర్తిగా ఫెయిల్ అయింది.
దరిమిలా.. తాను ఇక, ఎన్నికల ఫలితాలపై ప్రకటించనని.. చెప్పిన రాజగోపాల్.. దాదాపు రెండేళ్లుగా మౌనం గా ఉన్నారు. అయితే. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను నేరుగా ఉటంకించకుండానే.. ఆయన కొన్ని కామెంట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్తో తనకు చాలా అనుబంధం ఉందని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు… రాజకీయాలకు ముందు నుంచి కూడా తనకు-జగన్కు మధ్య స్నేహం ఉందన్నారు.
అంతేకాదు.. ముఖ్యమంత్రి కావాలన్న.. జగన్ ఆకాంక్ష నెరవేరిందని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే.. జగన్ పాలన చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ… తాను జగన్ పాలనపై ఎలాంటి వ్యాక్యలు చేయలేనని లగడపాటి పరోక్షంగా చెప్పుకోవడం గమనార్హం. మరో మూడేళ్ల పాలన తర్వాతే జగన్ పాలన ఎలా ఉందో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా మారాయి. కొసమెరుపు ఏంటంటే.. రాజగోపాల్ తన తనయుడు.. ప్రణయ్ను త్వరలోనే రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే. ఏ పార్టీలో ఆయన చేరతారు.. అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో సీఎం జగన్కు అనుకూలంగా రాజగోపాల్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిని బట్టి.. రాజగోపాల్ తన తనయుడిని వైసీపీలోకి చేరుస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on March 10, 2021 6:30 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…