Political News

అందుకే అందరినీ దూరం పెట్టేశారా ?

విజయవాడ నగరం తెలుగుదేశంపార్టీ నేతలు-చంద్రబాబునాయుడు వ్యవహారంపై పార్టీలో చర్చ పెరిగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వచ్చే ముందురోజు పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు రోడ్డుపై పడిన విషయం తెలిసిందే. ఎంపి కేశినేని నాని-ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ+అధికార ప్రతినిధి నాగూల్ మీరా మధ్య ఉన్న విభేదాలతో రచ్చ రచ్చ అయిపోయింది.

పై ముగ్గురు ఎంపిని మీడియా సమావేశంలోనే నోటికొచ్చినట్లు తిట్టారు. తిట్టడమే కాకుండా ఎంపి గనుక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వెంట ఉంటే తాము పాల్గొనేది లేదని కూడా అల్టిమేటమ్ ఇవ్వటం పార్టీలో  సంచలనమైంది. వాళ్ళ అల్టిమేటమ్ చూసిన తర్వాత పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత టీడీ జనార్ధన్ తో ముగ్గురి నేతలతో మాట్లడించినా పెద్దగా ఉపయోగం కనబడలేదని సమాచారం.

అన్నీ విషయాలు ఆలోచించిన చంద్రబాబు చివరకు తన పర్యటనలో పై నేతలందరినీ దూరంగా ఉంచేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన రోడ్డుషోలో చంద్రబాబు పక్కన ఎంపి కూతురు కేశినేని శ్వేత కనిపించారే కానీ ఎంపి ఎక్కడా కనబడలేదు. ఇక ఒకటిరెండు చోట్ల  బుద్ధా వెంకన్న కనిపించారే కానీ తర్వాత ఆయనా అడ్రస్ లేరు. బోండా, నాగూల్ పర్యటనలో పాల్గొన్నారో లేదో కూడా తెలీదు.

వీళ్ళందరి వ్యవహరం ఇలాగుంచితే మాజీమంత్రి దేవినేని ఉమ పరిస్ధితి అయితే మరీ అన్యయమైపోయింది. చంద్రబాబు ఎప్పుడు రోడ్డుపైకి వచ్చిన పక్కనే కనిపించే దేవినేని అసలు ఎక్కడా కనబడలేదు. దేవినేనికి ఎంపికి కూడా ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు ఎంపి కూతురే మేయర్ అభ్యర్ధి కావటంతో రోడ్డుషోల్లో ఆమె చంద్రబాబు పక్కనే ఉన్నారు. అందుకనే చంద్రబాబు వాహనంలో ఉమ పాల్గొనలేదని సమాచారం.

మొత్తానికి రోడ్డుషో జరిగిన తీరు చూస్తుంటే చంద్రబాబే అందరినీ గంపగుత్తగా దూరం పెట్టేసి మేయర్+డివిజన్ అభ్యర్ధులతో ప్రచారం పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. అయినా నేతల మధ్య విభేదాలు ఇంతస్ధాయిలో ఉంటే ఇక పార్టీ అభ్యర్ధులు ఏమి గెలుస్తారు ? గెలిచే అవకాశం లేని సీటు విషయంలో ఇంత గొడవలు దేనికో.

This post was last modified on March 9, 2021 2:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కూట‌మి మేనిఫెస్టో.. సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే!

తాజాగా ఏపీలో కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీలు మేనిఫెస్టో విడుద‌ల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్ర‌బాబు చెబుతున్న…

2 hours ago

ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…

3 hours ago

ప్రేమికుడుని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు

దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…

3 hours ago

పరశురామ్‌కు దిద్దుకోలేనంత డ్యామేజీ

యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…

4 hours ago

ఉద్యోగాలపై ఇదేం లాజిక్ జగన్ సార్?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…

6 hours ago

కమల్ సినిమాకు కమల్ సినిమా సంకటం

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…

7 hours ago