Political News

జగన్ కి అంతా తెలుసు అని మరోసారి కన్ ఫం చేసిన కేంద్రం

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశం.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు తెలిసే జ‌రుగుతోంద‌ని మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై వైసీపీ నాయ‌కులు చెప్పిన మాట‌లు, చేస్తున్న ప‌నులు ఈ ప‌రిణామంతో అంతా మాయేన‌ని స్ప‌ష్ట‌మైంది. ప్ర‌భుత్వం ఉన్న‌ది వ్యాపారం చేసేందుకు కాదంటూ.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించే ప్ర‌క్రియ‌ను కేంద్రం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కూడా ఉండ‌డం.. ఏపీ ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింది. ఎంతో మంది త్యాగాలు, 36 మంది ప్రాణ‌త్యాగంతో ఏర్ప‌డిన ఈ విశాఖ క‌ర్మాగారం.. ఆంధ్రుల హ‌క్కుగా ఉంద‌ని.. పేర్కొంటూ.. ప్ర‌జ‌ల నుంచి ఉద్య‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి.

అయితే.. ఈ విష‌యంలో అధికార ప‌క్షం వైసీపీ.. అనేక మాట‌లు చెప్పింది. తాము దీనిని వ్య‌తిరేకిస్తామంటూ.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా పాద‌యాత్ర చేశారు. అక్క‌డ ఉద్య‌మిస్తున్న కార్మికుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ కూడా దీనిపై కార్మిక సంఘాల‌తో చ‌ర్చించి.. ఉక్కు విష‌యంలో వెన‌క్కి త‌గ్గేలా చూస్తామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సుదీర్ఘ లేఖ రాశారు. శాశ్వ‌త గ‌నులు కేటాయించ‌డం.. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను షేర్ మార్కెట్‌లో పెట్ట‌డం ద్వారా.. లాభాల బాట ప‌ట్టించ వ‌చ్చంటూ.. పేర్కొన్నారు. దీనిని బ‌ట్టి అస‌లు త‌మ‌కు ఏమీ తెలియ‌ద‌ని.. ఉక్కు నిర్ణ‌యం అంతా కేంద్రానిదేన‌ని.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. తాజాగా ఈ ఉక్కు ప‌రిశ్ర‌మ విష‌యంపై పార్ల‌మెంటులో విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. స‌మాధానం చెప్పారు. స్టీల్‍ప్లాంట్‍లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్లాంట్‍లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవని తెలిపారు.

అదే స‌మ‌యంలో విశాఖ ఉక్కు అమ్మ‌కం పై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామ‌ని ఆమె సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరిన‌ట్టు కూడా నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌, ఆయ‌న ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ కేవ‌లం మొస‌లి క‌న్నీరేన‌ని స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 9, 2021 8:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

36 minutes ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

2 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

3 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 hours ago