Political News

డిప్యుటీ మేయర్ గా అరంగేట్రం

తొందరలో జరగబోతున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యుటి మేయర్ గా అభినయ్ రెడ్డి ఎన్నికవ్వటం ఖాయమేనా ? తిరుపతిలో జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే అభినయ్ రెడ్డి ఎన్నిక లాంఛనమనే చెప్పాలి. ఎందుకంటే అభినయ్ తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కాబట్టి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారుసునిగా కొడుకును పోటీ చేయించే ప్లాన్ లో ఎంఎల్ఏ ఉన్నారు.

షెడ్యూల్ ఎన్నికలకు ముందు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా దీన్నే రాజకీయ అరంగేట్రంగా ఉపయోగించుకోవాలని భూమన డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కార్పొరేషన్ 4వ డివిజన్ నుండి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. అధికారికంగా ప్రకటించటమే మిగిలుంది. నిజానికి కొడుకును మేయర్ పీఠం మీదే కూర్చోబెట్టాలని ఎంఎల్ఏ ముందు అనుకున్నారు. అయితే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు.

తిరుపతిలో బీసీలు, బలిజలు, బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువున్నాయి. వీళ్ళ తర్వాత ముస్లిం మైనారిటిలు, రెడ్లు, ఎస్సీ, క్రిస్తియన్ల జనాభా ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత సామాజికవర్గాన్ని కూడా పక్కన పెట్టేసి బీసీలు, కాపులు, ముస్లిం మైనారిటిలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎంఎల్ఏ తన ఆలోచనను మార్చుకుని తిరుపతి కార్పొరేషన్ కు బీసీ మహిళను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని డిసైడ్ అయ్యారు.

నిజానికి తిరుపతి మేయర్ పోస్టు జనరల్ కోటాలోనే ఉంది. అయినా బీసీ మహిళను ఎంపిక చేయటంలో రెండు ప్రయోజనాలున్నాయి. మొదటిది జగన్ అడుగుజాడల్లో నడుస్తు బీసీకి+మహిళకు ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుంది. రెండోది తన కొడుకు ఏకగ్రీవంగా గెలిచినా మేయర్ పీఠం విషయంలో పార్టీ లైనుకు కట్టుబడున్నట్లు చెప్పుకోవచ్చు. మూడోది భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పై సామాజికవర్గాల మద్దతును కూడగట్టవచ్చని ఎంఎల్ఏ ఆలోచించినట్లు ప్రచారంలో ఉంది.

సరే డిప్యుటి మేయర్ విషయాన్ని పక్కన పెట్టేస్తే మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనేది ఆసక్తిగా మారింది. 27వ డివిజన్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ జల్లి శిరీష, అనిత మధ్యే పోటీ ఉందంటున్నారు. అయితే ఎంఎల్ఏతో పాటు చాలామంది శిరీష వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ డాక్టర్ చాలా కాలంగా పార్టీలోనే పనిచేస్తున్నారు. అనిత మాత్రం మొన్నటి ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. దీంతో కార్పొరేషన్ అయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలో మేయర్ పీఠాన్ని డాక్టర్ శిరీష కూర్చునే అవకాశాలున్నాయి. చివరి నిముషంలో రాజకీయం ఏమన్నా మారుతుందేమో చూడాలి.

This post was last modified on March 8, 2021 3:19 pm

Share
Show comments

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago