Political News

వైసీపీ-కరణం మధ్య ఏం జరుగుతోంది ?

ఇపుడిదే జిల్లాలో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ తరపున 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే గెలిచారు. వీరిలో ప్రకాశం జిల్లాలోని కరణం బలరామ్ కూడా ఒకరు. ఈయన చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ మీద సుమారు 30 వేల మెజారిటితో గెలిచారు. దశాబ్దాల పాటు టీడీపీతో అనుబంధం ఉన్న కరణం పార్టీని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే టీడీపీకి భవిష్యత్తులేదన్న ఉద్దేశ్యంతో.

అయితే నేరుగా వైసీపీలో చేరలేదు. తన కొడుకు కరణం వెంకటేష్ తో పాటు మరికొందరిని అధికారపార్టీలోకి పంపారు. తాను ప్రత్యక్షంగా చేరకపోయినా వైసీపీతోనే అంటకాగుతున్నారు. ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. ఈయన నేరుగా వైసీపీలో చేరకపోవటంతో అధికారపార్టీ నేతలు, క్యాడర్ ఎంఎల్ఏతో కలవలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈయన వైసీపీతో తిరుగుతున్న కారణంగా టీడీపీ నేతలు, క్యాడర్ తో దూరం పెరిగిపోయింది.

ఇక్కడే కరణం వ్యవహారంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు కరణంకు టీడీపీని వదిలేసే ఆలోచన ఉందా ? అన్నదే అసలైన సందేహం. ఎందుకంటే టీడీపీకి ఎంఎల్ఏకి మధ్య బలమైన సామాజికబంధం ఉంది. ఎంఎల్ఏ వైసీపీ నేతలతో తిరుగుతున్నా క్యాడర్ మాత్రం ఈయన్ను పట్టించుకోవటం లేదు. క్యాడర్ కు ఏదైనా అవసరం అయితే ఆమంచి దగ్గరకు వెళుతున్నారే కానీ కరణం దగ్గరకు వెళ్ళటం లేదు. వైసీపీలో పూర్తిగా చేరని కారణంగా ఎంఎల్ఏ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు.

వ్యక్తిగతంగా కరణంతో సన్నిహితులైన వాళ్ళంతా ఇంకా టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. కొడుకును వైసీపీలో చేర్చారు. తన సన్నిహితుల్లో చాలామంది ఇంకా టీడీపీలోనే ఉన్నారు. తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయలేదు. అలాగని టీడీపీతో కాకుండా వైసీపీ నేతలతో తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే కరణం రెండు పడవలపైనా ప్రయాణం చేస్తున్నారా ? అనే అనుమానం పెరిగిపోతోంది. వ్యూహాత్మకంగా అవసరాల కోసమే వైసీపీకి దగ్గరయ్యారా ? అనే టాక్ కూడా పెరిగిపోతోంది. మొత్తానికి వైసీపీ-కరణం మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి.

This post was last modified on March 6, 2021 5:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

1 min ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

28 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

40 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago