ఇపుడిదే జిల్లాలో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ తరపున 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే గెలిచారు. వీరిలో ప్రకాశం జిల్లాలోని కరణం బలరామ్ కూడా ఒకరు. ఈయన చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ మీద సుమారు 30 వేల మెజారిటితో గెలిచారు. దశాబ్దాల పాటు టీడీపీతో అనుబంధం ఉన్న కరణం పార్టీని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే టీడీపీకి భవిష్యత్తులేదన్న ఉద్దేశ్యంతో.
అయితే నేరుగా వైసీపీలో చేరలేదు. తన కొడుకు కరణం వెంకటేష్ తో పాటు మరికొందరిని అధికారపార్టీలోకి పంపారు. తాను ప్రత్యక్షంగా చేరకపోయినా వైసీపీతోనే అంటకాగుతున్నారు. ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. ఈయన నేరుగా వైసీపీలో చేరకపోవటంతో అధికారపార్టీ నేతలు, క్యాడర్ ఎంఎల్ఏతో కలవలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈయన వైసీపీతో తిరుగుతున్న కారణంగా టీడీపీ నేతలు, క్యాడర్ తో దూరం పెరిగిపోయింది.
ఇక్కడే కరణం వ్యవహారంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు కరణంకు టీడీపీని వదిలేసే ఆలోచన ఉందా ? అన్నదే అసలైన సందేహం. ఎందుకంటే టీడీపీకి ఎంఎల్ఏకి మధ్య బలమైన సామాజికబంధం ఉంది. ఎంఎల్ఏ వైసీపీ నేతలతో తిరుగుతున్నా క్యాడర్ మాత్రం ఈయన్ను పట్టించుకోవటం లేదు. క్యాడర్ కు ఏదైనా అవసరం అయితే ఆమంచి దగ్గరకు వెళుతున్నారే కానీ కరణం దగ్గరకు వెళ్ళటం లేదు. వైసీపీలో పూర్తిగా చేరని కారణంగా ఎంఎల్ఏ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు.
వ్యక్తిగతంగా కరణంతో సన్నిహితులైన వాళ్ళంతా ఇంకా టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. కొడుకును వైసీపీలో చేర్చారు. తన సన్నిహితుల్లో చాలామంది ఇంకా టీడీపీలోనే ఉన్నారు. తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయలేదు. అలాగని టీడీపీతో కాకుండా వైసీపీ నేతలతో తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే కరణం రెండు పడవలపైనా ప్రయాణం చేస్తున్నారా ? అనే అనుమానం పెరిగిపోతోంది. వ్యూహాత్మకంగా అవసరాల కోసమే వైసీపీకి దగ్గరయ్యారా ? అనే టాక్ కూడా పెరిగిపోతోంది. మొత్తానికి వైసీపీ-కరణం మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి.
This post was last modified on March 6, 2021 5:49 pm
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…