Political News

బెంగాల్లో హై ఓల్డేజ్ టెన్షన్ మొదలైందా ?

అవును పశ్చిమబెంగాల్లో అసలైన టెన్షన్ ఇపుడే మొదలైంది. శుక్రవారం మమతాబెనర్జీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను చూడగానే చాలామంది షాక్ కు గురయ్యారు. ఇందుకు కారణం ఏమిటంటే తొందరలో జరగబోయే ఎన్నికల్లో మమత నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండటమే. నందిగ్రామ్ నియోజకవర్గమంటే అలాంటిలాంటి నియోజకవర్గం కాదు. అందుకనే ఏక కాలంలో ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది.

సంవత్సరాల తరబడి మమత భవానీపూర్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారు. ఆమెకు ఈ నియోజకవర్గంలో తిరుగులేదు. అయితే తాజాగా భవానీపూర్ నుండి కాకుండా నందిగ్రామ్ లో పోటీ చేయాలన్న నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే మొన్నటివరకు మమతకు కుడిభుజంగా ఉన్న పార్లమెంటు సభ్యుడు సుబేందు అధికారిది నిందిగ్రామే. సుబేందు కుటుంబానికి సుమారు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది.

సుబేందు కుటుంబాన్ని కాదని ప్రత్యర్ధులు గెలవటం దాదాపు కష్టమే. దశాబ్దాల పాటు వీళ్ళ కుటుంబానిదే పై ప్రాంతంలో ఆధిపత్యం. ఇంతకాలం మమతకు కుడిభుజంగా వ్యవహరించిన సుబేందు కుటుంబం సీఎంతో విభేదించి బీజేపీలో చేరారు. వీళ్ళ కుటుంబానికి నందిగ్రామ్ చాలా కీలకం. కాబట్టి కొడితే కుంభస్ధలాన్నే కొట్టాలన్న ప్లాన్ తోనే మమత నందిగ్రామ్ లో పోటీ చేయటానికి డిసైడ్ అయ్యారు.

మమత వ్యూహం ఏమిటంటే నందిగ్రామ్ లో గనుక తాను పోటీ చేస్తే సుబేందు కుటుంబం మొత్తం దృష్టినంతా నందిగ్రామ్ లోనే కేంద్రీకృతం చేస్తుంది. దీంతో మిగిలిన నియోజకవర్గాలపై వాళ్ళ దృష్టి తగ్గుతుంది. వాళ్ళని నందిగ్రామ్ కు పరిమితం చేయటం, తాను గెలిచి సుబేందు కుటుంబం ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడమే వ్యూహంతో మమత పావులు కదుపుతున్నారు. అభ్యర్ధుల జాబితా విడుదల కాగానే బెంగాల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.

నందిగ్రామ్ లో మమత పోటీ ఖాయమైపోయింది కాబట్టి బీజేపీ తరపున లేదా సుబేందు కుటుంబం తరపున ఎవరు పోటీ చేస్తారో చూడాలి. భవానీపుర్ నుండి మమత ప్లేసులో సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ పోటీ చేస్తున్నారు. మొదటి జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలున్నారు. మొత్తానికి ఎన్నికల్లో హై ఓల్టేజీ ప్రారంభమైనట్లే.

This post was last modified on March 6, 2021 10:59 am

Share
Show comments
Published by
satya

Recent Posts

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

34 mins ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

35 mins ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

2 hours ago

విజ‌య గంటా మోగేనా?

టీడీపీ సీనియ‌ర్ నేత గంటా శ్రీనివాస‌రావు వ‌రుస‌గా అయిదోసారి ఎమ్మెల్యేగా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…

2 hours ago

‘కావలి’ కాచేది ఎవరో ?

ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో కాపు, కమ్మ, రెడ్ల మధ్య రాజకీయాలు నడిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా రెడ్ల…

2 hours ago

రామాయణం లీక్స్ మొదలుపెట్టేశారు

ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్…

3 hours ago