Political News

జగన్ ఢిల్లీ టూర్ – వైసీపీ వెర్షనేంటి?

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. విశాఖ ఉక్కు విషయంలో జరుగుతున్న ఆందోళనతో పాటు.. ఇటీవలి పరిణామాలపై ప్రధాని మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లాలని అనుకుంటున్నారు. వాస్తవానికి తిరుపతిలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అమిత్ షా వచ్చినప్పుడు.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావాలని భావించారు.

అయితే.. ఆయన పర్యటన రద్దు కావటంతో ఇప్పుడు జగనే ఢిల్లీకి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇదేమీ కాదు.. సీఎం జగన్ ను ఢిల్లీకి రావాలని కేంద్రం నుంచే కబురు వచ్చినట్లు చెబుతున్న వారు లేకపోలేదు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరికినా దొరక్కపోయినా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటం.. కేంద్ర దన్ను అవసరం కావటంతో పాటు.. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికైతే ముందుకు వెళ్లకుండా ఆగాలని కోరనున్నట్లు చెబుతున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక నగరాలైన విశాఖ.. విజయవాడ.. తిరుపతి.. లాంటి వాటిని సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి వాటికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుగా మారింది.

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదం అంతకంతకూ బలోపేతం కావటం.. ప్రజల సెంటిమెంట్లను కేంద్రానికి చెప్పి.. వారి నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సీఎం జగన్ కోరనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. పోలవరం ఎత్తు తగ్గించటం కుదరదన్న విషయాన్ని తేల్చి చెప్పాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకుకేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వాటిని విడుదల చేయాలని కోరనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

This post was last modified on March 3, 2021 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

13 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

22 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

3 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

4 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

5 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago