Political News

జగన్ ఢిల్లీ టూర్ – వైసీపీ వెర్షనేంటి?

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. విశాఖ ఉక్కు విషయంలో జరుగుతున్న ఆందోళనతో పాటు.. ఇటీవలి పరిణామాలపై ప్రధాని మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లాలని అనుకుంటున్నారు. వాస్తవానికి తిరుపతిలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అమిత్ షా వచ్చినప్పుడు.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావాలని భావించారు.

అయితే.. ఆయన పర్యటన రద్దు కావటంతో ఇప్పుడు జగనే ఢిల్లీకి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇదేమీ కాదు.. సీఎం జగన్ ను ఢిల్లీకి రావాలని కేంద్రం నుంచే కబురు వచ్చినట్లు చెబుతున్న వారు లేకపోలేదు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరికినా దొరక్కపోయినా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటం.. కేంద్ర దన్ను అవసరం కావటంతో పాటు.. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికైతే ముందుకు వెళ్లకుండా ఆగాలని కోరనున్నట్లు చెబుతున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక నగరాలైన విశాఖ.. విజయవాడ.. తిరుపతి.. లాంటి వాటిని సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి వాటికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుగా మారింది.

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదం అంతకంతకూ బలోపేతం కావటం.. ప్రజల సెంటిమెంట్లను కేంద్రానికి చెప్పి.. వారి నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సీఎం జగన్ కోరనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. పోలవరం ఎత్తు తగ్గించటం కుదరదన్న విషయాన్ని తేల్చి చెప్పాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకుకేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వాటిని విడుదల చేయాలని కోరనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

This post was last modified on March 3, 2021 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

45 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago