Political News

తిరుపతి మీద ఆశలు వదిలేసుకున్నట్లేనా ?

తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచనను బీజేపీ వదిలేసుకున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే స్ధానిక బీజేపీ నేతల మనోభావలతోను, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులతో ఏమాత్రం సబంధం లేకుండా, పట్టించుకోకుండా తనిష్టం వచ్చిన నిర్ణయాలను కేంద్రం తీసేసుకుంటోంది. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం ఇందులో భాగమే. రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎంత ప్రయత్నించినా ఈ విషయమై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు.

ఒకవైపు ప్రైవీటకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులు+స్ధానికులు ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయపార్టీలు కూడా కేంద్ర నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే విషయాన్ని, క్షేత్రస్ధాయిలో జనాల మనోభావాలను కేంద్రంలోని పెద్దలకు తెలియజేయటానికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో ఎంత ప్రయత్నించినా ఎవరు పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోగా తాజాగా ప్రైవేటీకరణ విషయంలో మరింత జోరు పెంచినట్లు ప్రకటించింది.

రాష్ట్రప్రయోజనాల విషయంలో కేంద్రం వైఖరి చూసిన తర్వాత ఏమి మాట్లాడాలో బీజేపీ నేతలకు దిక్కుతోచటం లేదు. దాంతో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతోంది. విశాఖ ఉక్కు నిర్ణయ ప్రభావం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై పడుతుందని అర్ధమైనట్లుంది. అందుకనే ఇపుడు బీజేపీ నేతలు అసలా ఊసే ఎత్తటంలేదు.

మొన్నటి వరకు తిరుపతిలో పోటీ చేయబోయేది తామే అంటు మిత్రపక్షం జనసేన నేతల దగ్గర తొడలు కొట్టిన కమలనాదులు ఇపుడా విషయాన్నే ప్రస్తావించటం లేదని సమాచారం. దాంతో ఇపుడు భారమంతా మొత్తం జనసేనపైనే పడేట్లుంది. పోటీ చేయబోయేదీ జనసేన అభ్యర్ధే, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కల్యాణ్ పైనే ఉందని పరోక్షంగా బీజేపీ నేతలు చెబుతున్నారట.

ఒకవైపు ఏపి విషయంలో పూర్తి నిర్లక్ష్యం చూపుతు, ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న కేంద్రం నిర్ణయంపై జనాలు మండిపోతున్నారు. ఈ పరిస్దితుల్లో తమ అభ్యర్ధిని గెలిపించుకోవటం ఎలాగ ? అన్నదే ఇపుడు జనసేనకు అర్ధం కావటంలేదు. గెలుపు అవకాశం ఏమాత్రం లేదని అర్ధమైపోయిన తర్వాతే బీజేపీ నేతలు పోటీ విషయంలో వెనకాడుతున్నారన్నది వాస్తవం. మరి ఈ విషయంలో మిత్రపక్షాలు ఏమి చేస్తాయన్నది ఆసక్తిగా మారింది.

This post was last modified on March 1, 2021 2:59 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

16 mins ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

18 mins ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

1 hour ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

2 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

3 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

5 hours ago