Political News

ప్ర‌భుత్వంపై చండ్ర‌నిప్పులు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ స‌ర్కారు స‌హా సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు కురిపించారు. ఈ ప్ర‌భుత్వానికి పోయే కాలం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలో ప‌ర్య‌టించి పార్టీ శ్రేణుల‌తో భేటీ కావాల‌ని భావించిన చంద్ర‌బాబుకు తిరుప‌తి పోలీసులు అడ్డు చెప్పారు. న‌గ‌రంలోకి అనుమ‌తి లేద‌ని.. పోలీస్ యాక్ట్ 30 అమ‌ల్లో ఉంద‌ని.. బాబుకు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ హ‌ఠాత్ప‌రిణామం తో చంద్ర‌బాబు రేణిగుంట విమానాశ్ర‌యంలోనే భేటీ అయ్యి.. నిర‌స‌న తెలుపుతున్నారు.

గ‌త మూడు గంట‌లుగా ఆయ‌న రేణిగుంట విమానాశ్ర‌యంలోనే చంద్ర‌బాబు కూర్చోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ క్ర‌మంలోనే ట్వీట్ట‌ర్ వేదిక‌గా .. చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. త‌న‌ను అడ్డుకోలేద‌ని.. త‌న‌ను ఎవ‌రూభ‌య‌ప‌ట్ట‌లేర‌ని కూడా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, జ‌గ‌న్‌ను ఉద్దేశించి కీల‌క కామెంట్లు కుమ్మ‌రించారు. భ‌యంతో ఎన్ని రోజులుపాలిస్తావు, ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోకుండా అడ్డుకుంటారా?
ఇక‌, నైనా జ‌గ‌న్ ప‌రిణితి సాధించాలి. అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మునిసిప‌ల్‌.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌ల‌కు ఎదుర‌వుతున్న ప‌రిణామాల‌ను నిల‌దీసేందుకు చంద్ర‌బాబు బ‌య‌లు దేరారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను అడ్డుకున్నారు. ఇక‌, మ‌రోవైపు .. పోలీసులు చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేశారు. న‌గ‌రంలో యాక్ట్ 30 అమ‌ల్లో ఉంద‌ని.. నిర‌స‌న‌ల‌కు, ప‌ర్య‌ట‌న‌ల‌కు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలోనే తాను క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌తో భేటీ అవుతాన‌ని చెప్పారు. అయినా.. కూడా చంద్ర‌బాబును అనుమ‌తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ ప‌రిణామం.. రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

This post was last modified on March 1, 2021 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

58 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago