Political News

సోషల్ మీడియా పైనే ఆశలు పెట్టుకున్నారా ?

చంద్రబాబునాయుడు తాజాగా నిర్వహించిన సమావేశం చూస్తుంటే అలాగే ఉంది. టీడీపీ అభిమానులు, మద్దతుదారులైన యువతతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో అత్యధికులు టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారే కావటం గమనార్హం. కుప్పంలో వీరితో భేటీ అయినపుడు అధికార పార్టీ ఆగడాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగే ప్రతిచోటా టీడీపీ సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్ గా ఉండాలని చెప్పారు.

ఎన్నికల్లో అధికారపార్ట అక్రమాలు, అభ్యర్ధుల ప్రచారంలో ఉల్లంఘించే నిబంధనలను, అధికారపార్టీతో అధికారుల కుమ్మక్కు తదితరాలను సోషల్ మీడియాలో చూపించటం ద్వారా జనాల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. చంద్రబాబు తాజా ఆదేశాలను గమనిస్తే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియాపైన పెద్ద బాధ్యతే పెట్టినట్లున్నారు.

మామూలుగానే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పార్టీ నేతలు, శ్రేణుల ప్రచారం కన్నా సోషల్ మీడియా చేస ప్రచారమే ఎన్నోరెట్లు అధికంగా ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావటానికి పార్టీ సోషల్ మీడియా విభాగం చాలా కీలకపాత్ర పోషించింది. అలాంటి వింగ్ వివిధ కారణాల వల్ల 2019 ఎన్నికల్లో చతికలపడింది.

ఇదే సమయంలో వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియా వింగ్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జనాల్లో బాగా చొచ్చుకుపోయింది. దీని ఫలితంగా జనాల్లో జగన్ అంటే సానుకూలత ఏర్పడింది. చంద్రబాబు వైఫల్యాలు, జగన్ పాదయాత్ర, హామీలు తదితరాలు కలిసివచ్చి వైసీపీకి 151 సీట్ల అఖండ మెజారిటి వచ్చింది. చంద్రబాబు కూడా ఎందుకనో మొన్నటి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను పట్టించుకున్నట్లు లేరు. అలాంటిది తాజాగా మళ్ళీ సోషల్ మీడియాపై పెద్ద దృష్టి పెట్టారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూద్దాం.

This post was last modified on February 28, 2021 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

9 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

35 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago