Political News

సోషల్ మీడియా పైనే ఆశలు పెట్టుకున్నారా ?

చంద్రబాబునాయుడు తాజాగా నిర్వహించిన సమావేశం చూస్తుంటే అలాగే ఉంది. టీడీపీ అభిమానులు, మద్దతుదారులైన యువతతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో అత్యధికులు టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారే కావటం గమనార్హం. కుప్పంలో వీరితో భేటీ అయినపుడు అధికార పార్టీ ఆగడాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగే ప్రతిచోటా టీడీపీ సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్ గా ఉండాలని చెప్పారు.

ఎన్నికల్లో అధికారపార్ట అక్రమాలు, అభ్యర్ధుల ప్రచారంలో ఉల్లంఘించే నిబంధనలను, అధికారపార్టీతో అధికారుల కుమ్మక్కు తదితరాలను సోషల్ మీడియాలో చూపించటం ద్వారా జనాల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. చంద్రబాబు తాజా ఆదేశాలను గమనిస్తే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియాపైన పెద్ద బాధ్యతే పెట్టినట్లున్నారు.

మామూలుగానే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పార్టీ నేతలు, శ్రేణుల ప్రచారం కన్నా సోషల్ మీడియా చేస ప్రచారమే ఎన్నోరెట్లు అధికంగా ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావటానికి పార్టీ సోషల్ మీడియా విభాగం చాలా కీలకపాత్ర పోషించింది. అలాంటి వింగ్ వివిధ కారణాల వల్ల 2019 ఎన్నికల్లో చతికలపడింది.

ఇదే సమయంలో వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియా వింగ్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జనాల్లో బాగా చొచ్చుకుపోయింది. దీని ఫలితంగా జనాల్లో జగన్ అంటే సానుకూలత ఏర్పడింది. చంద్రబాబు వైఫల్యాలు, జగన్ పాదయాత్ర, హామీలు తదితరాలు కలిసివచ్చి వైసీపీకి 151 సీట్ల అఖండ మెజారిటి వచ్చింది. చంద్రబాబు కూడా ఎందుకనో మొన్నటి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను పట్టించుకున్నట్లు లేరు. అలాంటిది తాజాగా మళ్ళీ సోషల్ మీడియాపై పెద్ద దృష్టి పెట్టారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూద్దాం.

This post was last modified on February 28, 2021 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

17 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago