Political News

సోషల్ మీడియా పైనే ఆశలు పెట్టుకున్నారా ?

చంద్రబాబునాయుడు తాజాగా నిర్వహించిన సమావేశం చూస్తుంటే అలాగే ఉంది. టీడీపీ అభిమానులు, మద్దతుదారులైన యువతతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో అత్యధికులు టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారే కావటం గమనార్హం. కుప్పంలో వీరితో భేటీ అయినపుడు అధికార పార్టీ ఆగడాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగే ప్రతిచోటా టీడీపీ సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్ గా ఉండాలని చెప్పారు.

ఎన్నికల్లో అధికారపార్ట అక్రమాలు, అభ్యర్ధుల ప్రచారంలో ఉల్లంఘించే నిబంధనలను, అధికారపార్టీతో అధికారుల కుమ్మక్కు తదితరాలను సోషల్ మీడియాలో చూపించటం ద్వారా జనాల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. చంద్రబాబు తాజా ఆదేశాలను గమనిస్తే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియాపైన పెద్ద బాధ్యతే పెట్టినట్లున్నారు.

మామూలుగానే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పార్టీ నేతలు, శ్రేణుల ప్రచారం కన్నా సోషల్ మీడియా చేస ప్రచారమే ఎన్నోరెట్లు అధికంగా ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావటానికి పార్టీ సోషల్ మీడియా విభాగం చాలా కీలకపాత్ర పోషించింది. అలాంటి వింగ్ వివిధ కారణాల వల్ల 2019 ఎన్నికల్లో చతికలపడింది.

ఇదే సమయంలో వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియా వింగ్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జనాల్లో బాగా చొచ్చుకుపోయింది. దీని ఫలితంగా జనాల్లో జగన్ అంటే సానుకూలత ఏర్పడింది. చంద్రబాబు వైఫల్యాలు, జగన్ పాదయాత్ర, హామీలు తదితరాలు కలిసివచ్చి వైసీపీకి 151 సీట్ల అఖండ మెజారిటి వచ్చింది. చంద్రబాబు కూడా ఎందుకనో మొన్నటి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను పట్టించుకున్నట్లు లేరు. అలాంటిది తాజాగా మళ్ళీ సోషల్ మీడియాపై పెద్ద దృష్టి పెట్టారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూద్దాం.

This post was last modified on February 28, 2021 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

9 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

4 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

4 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

6 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

6 hours ago