పార్టీకి కొత్తరక్తం ఎక్కిస్తాను..మూడు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి. నిజానికి పార్టీకి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం దాదాపు పదేళ్ళ క్రితమే వచ్చేసింది. కానీ ఇప్పటికీ ముసలి రక్తంతోనే బండిని లాగిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కొత్తరక్తం మాటను ఇప్పటికి కొన్ని వందలసార్లు చెప్పుంటారు. కానీ ఒక్కసారికూడా కొత్త రక్తం ఎక్కించే సాహసం చేయలేకపోయారు.
అప్పుడెప్పుడో 1982లో ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు యువకులుగా పార్టీలో చేరిన వారితోనే ఇఫుడు కూడా చంద్రబాబు రాజకీయాలు కానీచ్చేస్తున్నారు. అప్పట్లో 30ల్లో ఉన్న నేతలకు ఇపుడు 70ల్లోకి చేరుకున్నారు. అయినా వాళ్ళు పక్కకు పోరు కొత్తవాళ్ళని రానివ్వరు. చివరకు చంద్రబాబు కూడా కొత్తవారిని తీసుకురావటంలో ఫెయిలవుతున్నారు.
ఒకవేళ ఎవరైనా కొత్తరక్తం వచ్చారని అనుకుంటే అది కచ్చితంగా సీనియర్ల వారుసులే అయ్యుంటారనటంలో సందేహం లేదు. చింతకాయల అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కేఈ కృష్ణమూర్తి, పరిటాల సునీత, జేసీ బ్రదర్స్ లాంటి సీనియర్ నేతల పిల్లలే కొత్తరక్తంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. వీళ్ళ ప్రధాన అర్హత వారసత్వమే కానీ ఇతరత్రా ఏమి ఉందో ఎవరికీ తెలీదు.
ఇలా కాకుండా పార్టీలో పనిచేస్తున్న చురుకైన యువనేతలను గుర్తించి వారికి చంద్రబాబు మద్దతుగా నిలబడి ప్రోత్సహిస్తే మంచి నాయకత్వం తయారయ్యే అవకాశాలు టీడీపీలో పుష్కలంగా ఉంది. కానీ ఆ అవకాశాన్ని చంద్రబాబు తనంతట తానే చెడగొట్టుకుంటున్నారు. యువరక్తం, కొత్తరక్తం అంటే సీనియర్ల వారసులనే ముద్ర పడిపోయింది. సీనియర్లు+వారసులు పక్కకు వెళ్ళరు, చంద్రబాబు కూడా వాళ్ళని కాదని ఏమీ చేయలేని పరిస్దితిలో ఉన్నారు.
కాబట్టి కుప్పంలో చంద్రబాబు చెప్పినట్లు కొత్తరక్తం ఎక్కించే విషయాన్ని పార్టీలోనే లైటుగా తీసుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఇప్పటికీ మాటను చాలాసార్లు చంద్రబాబు చెప్పుండటమే. ఇప్పటికైనా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో చూపిస్తేనే పార్టీ బలోపేతమవుతుంది లేకపోతే అంతే సంగతులు.
This post was last modified on February 27, 2021 2:26 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…