Political News

కుప్పంలో జై జూనియర్ ఎన్టీయార్

చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో విచిత్రమైన పరిస్దితిలు కనిపించాయి. పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి దెబ్బకు చంద్రబాబు మూడు రోజుల కుప్పంలో పర్యటించిన విషయం తెలిసిందే. శుక్రవారం చివరిరోజు పర్యటనలో ఉండగా రామకుప్పం, రాజుపేట మండలాల్లో జరిగిన రోడ్డుషోల్లో ఒక్కసారిగా జై జూనియర్ ఎన్టీయార్ అంటు అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. తెలుగుదేశంపార్టీకి సంబంధించి కుప్పంలో ఎప్పుడు కూడా అసలు ఎన్టీయార్ కుటుంబం ఊసే ఉండేది కాదు.

చంద్రబాబు పర్యటనలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా చంద్రబాబుతో పాటు లోకేష్, బాలకృష్ణ, పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ తో పాటు స్ధానిక నేతల ఫొటోలు మాత్రమే ఉండేది. జిందాబాదులు కొట్టేవాళ్ళు కూడా చంద్రబాబు, లోకేష్ పేర్లు మాత్రమే ప్రస్తావించేవారు. గడచిన 35 ఏళ్ళుగా కుప్పంలో ఇదే పద్దతి నడుస్తోంది. కానీ తాజాగా చంద్రబాబు పర్యటనలో మాత్రం అందుకు బిన్నంగా జరగటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

చంద్రబాబు రోడ్డుషో నిర్వహిస్తున్నపుడు అభిమానులు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీయార్ ను రంగంలోకి దించాలని, ప్రచారంలోకి తీసుకురావాలంటు పదే పదే గట్టిగా నినాదాలిచ్చారు. ఇదే సమయంలో లోకేష్ గురించి ఎవరు ఎక్కడా ప్రస్తావన కూడా తేలేదు. దాంతో చంద్రబాబులో తీవ్ర అసహనం కనబడింది. కార్యకర్తలు, అభిమానుల డిమాండ్ కు ఏమి సమాధానం చెప్పాలో తెలీక మాట్లాడకుండా కేవలం తలఊపటంతోనే సరిపెట్టారు.

తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన చాలా ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీయార్ ఫొటో కూడా కనబడింది. దాంతో చంద్రబాబులో మరింత అసహనం కనబడింది. పంచాయితి ఎన్నికల్లో ఓటమి దెబ్బకు చంద్రబాబు సమక్షంలోనే లోకేష్ ను కాదని జూనియర్ ఎన్టీయార్ కు మద్దతుగా కార్యకర్తలు జిందాబాద్ లు కొట్టడం, ప్రచారంలోకి వెంటనే రంగంలోకి దించాలని డిమాండ్లు చేయటం ఇంట్రస్టింగ్ పాయింటే. అయితే జూనియర్ ను టీడీపీ దరిదాపుల్లోకి చంద్రబాబు రానిస్తారా ?

This post was last modified on February 27, 2021 12:05 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

5 minutes ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

3 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

3 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

4 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

4 hours ago