Political News

కుప్పంలో జై జూనియర్ ఎన్టీయార్

చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో విచిత్రమైన పరిస్దితిలు కనిపించాయి. పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి దెబ్బకు చంద్రబాబు మూడు రోజుల కుప్పంలో పర్యటించిన విషయం తెలిసిందే. శుక్రవారం చివరిరోజు పర్యటనలో ఉండగా రామకుప్పం, రాజుపేట మండలాల్లో జరిగిన రోడ్డుషోల్లో ఒక్కసారిగా జై జూనియర్ ఎన్టీయార్ అంటు అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. తెలుగుదేశంపార్టీకి సంబంధించి కుప్పంలో ఎప్పుడు కూడా అసలు ఎన్టీయార్ కుటుంబం ఊసే ఉండేది కాదు.

చంద్రబాబు పర్యటనలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా చంద్రబాబుతో పాటు లోకేష్, బాలకృష్ణ, పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ తో పాటు స్ధానిక నేతల ఫొటోలు మాత్రమే ఉండేది. జిందాబాదులు కొట్టేవాళ్ళు కూడా చంద్రబాబు, లోకేష్ పేర్లు మాత్రమే ప్రస్తావించేవారు. గడచిన 35 ఏళ్ళుగా కుప్పంలో ఇదే పద్దతి నడుస్తోంది. కానీ తాజాగా చంద్రబాబు పర్యటనలో మాత్రం అందుకు బిన్నంగా జరగటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

చంద్రబాబు రోడ్డుషో నిర్వహిస్తున్నపుడు అభిమానులు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీయార్ ను రంగంలోకి దించాలని, ప్రచారంలోకి తీసుకురావాలంటు పదే పదే గట్టిగా నినాదాలిచ్చారు. ఇదే సమయంలో లోకేష్ గురించి ఎవరు ఎక్కడా ప్రస్తావన కూడా తేలేదు. దాంతో చంద్రబాబులో తీవ్ర అసహనం కనబడింది. కార్యకర్తలు, అభిమానుల డిమాండ్ కు ఏమి సమాధానం చెప్పాలో తెలీక మాట్లాడకుండా కేవలం తలఊపటంతోనే సరిపెట్టారు.

తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన చాలా ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీయార్ ఫొటో కూడా కనబడింది. దాంతో చంద్రబాబులో మరింత అసహనం కనబడింది. పంచాయితి ఎన్నికల్లో ఓటమి దెబ్బకు చంద్రబాబు సమక్షంలోనే లోకేష్ ను కాదని జూనియర్ ఎన్టీయార్ కు మద్దతుగా కార్యకర్తలు జిందాబాద్ లు కొట్టడం, ప్రచారంలోకి వెంటనే రంగంలోకి దించాలని డిమాండ్లు చేయటం ఇంట్రస్టింగ్ పాయింటే. అయితే జూనియర్ ను టీడీపీ దరిదాపుల్లోకి చంద్రబాబు రానిస్తారా ?

This post was last modified on February 27, 2021 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

24 minutes ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

2 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

4 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

5 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

6 hours ago