టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి రాజకీయం చాలా స్పీడుగా మారిపోతోంది. టెక్కలి వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ ను జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో దువ్వాడపై అచ్చెన్న కొద్ది మెజారిటితో విజయం సాధించారు. దువ్వాడ ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో దువ్వాడ జోరుమీదే ఉన్నారు. అయితే ఇవతల అచ్చెన్న కూడా దూకుడు మీదుండే మానిషే కావటంతో ఇద్దరి మధ్య రాజకీయం నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటోంది.
ఎంతగా పార్టీ అధికారంలో ఉన్నా చట్టసభలోకి ప్రవేశించే అవకాశం దక్కలేదనే అసంతృప్తి దువ్వాడలో పేరుకుపోయింది. అయినా ఆ అసంతృప్తిని బయటపడనీయకుండానే నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే జగన్ అదేపనిగా పిలిచి మరీ దువ్వాడను శాసనమండలికి పంపుతున్నారు. దాందో దువ్వాడ ఫుల్లుగా ఖుషీ అయిపోయారు.
తాజాగా మారుతున్న పరిణామాలతో దువ్వాడ మరింతగా రెచ్చిపోవటం ఖాయం. నియోజకవర్గం ఇన్చార్జి హోదాలోనే దువ్వాడ రాజకీయాన్ని అచ్చెన్న తట్టుకోలేకపోతున్నారు. అందుకనే తాను కూడా స్పీడు పెంచుతున్న కారణంగానే ఇద్దరి మధ్యా తరచు గొడవలవుతున్నాయి. మరి తొందరలోనే ఎంఎల్సీ హోదాలో దువ్వాడ చేయబోయే రాజకీయాన్ని అచ్చెన్న ఎలా తట్టుకుంటారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
మొత్తంమీద మున్సిపల్, పరిషత్ ఎన్నికల ముందు దువ్వాడకు ఎంఎల్సీగా అవకాశం రావటంతో తొందరలో రెచ్చిపోవటం ఖాయం. ఎందుకంటే తనకు ఎంఎల్సీ పదవిని ఇచ్చిన జగన్ కు బహుమానంగా మున్సిపాలిటి+పరిషత్ స్ధానాలను ఇవ్వాలని డిసైడ్ అయిపోయారట. ఇటువైపు టీడీపీ అధ్యక్షుని హోదాలో అచ్చెన్న, అటువైపు ఎంఎల్సీ హోదాలో దువ్వాడ..ఇంకేమి కావలి. పసందైన రాజకీయానికి తెరలేవబోతోంది. చూద్దాం ఏం జరగబోతోందో.
This post was last modified on February 27, 2021 1:57 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…