Political News

టెక్కలిలో పసందైన రాజకీయం ?

టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి రాజకీయం చాలా స్పీడుగా మారిపోతోంది. టెక్కలి వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ ను జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో దువ్వాడపై అచ్చెన్న కొద్ది మెజారిటితో విజయం సాధించారు. దువ్వాడ ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో దువ్వాడ జోరుమీదే ఉన్నారు. అయితే ఇవతల అచ్చెన్న కూడా దూకుడు మీదుండే మానిషే కావటంతో ఇద్దరి మధ్య రాజకీయం నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటోంది.

ఎంతగా పార్టీ అధికారంలో ఉన్నా చట్టసభలోకి ప్రవేశించే అవకాశం దక్కలేదనే అసంతృప్తి దువ్వాడలో పేరుకుపోయింది. అయినా ఆ అసంతృప్తిని బయటపడనీయకుండానే నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే జగన్ అదేపనిగా పిలిచి మరీ దువ్వాడను శాసనమండలికి పంపుతున్నారు. దాందో దువ్వాడ ఫుల్లుగా ఖుషీ అయిపోయారు.

తాజాగా మారుతున్న పరిణామాలతో దువ్వాడ మరింతగా రెచ్చిపోవటం ఖాయం. నియోజకవర్గం ఇన్చార్జి హోదాలోనే దువ్వాడ రాజకీయాన్ని అచ్చెన్న తట్టుకోలేకపోతున్నారు. అందుకనే తాను కూడా స్పీడు పెంచుతున్న కారణంగానే ఇద్దరి మధ్యా తరచు గొడవలవుతున్నాయి. మరి తొందరలోనే ఎంఎల్సీ హోదాలో దువ్వాడ చేయబోయే రాజకీయాన్ని అచ్చెన్న ఎలా తట్టుకుంటారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

మొత్తంమీద మున్సిపల్, పరిషత్ ఎన్నికల ముందు దువ్వాడకు ఎంఎల్సీగా అవకాశం రావటంతో తొందరలో రెచ్చిపోవటం ఖాయం. ఎందుకంటే తనకు ఎంఎల్సీ పదవిని ఇచ్చిన జగన్ కు బహుమానంగా మున్సిపాలిటి+పరిషత్ స్ధానాలను ఇవ్వాలని డిసైడ్ అయిపోయారట. ఇటువైపు టీడీపీ అధ్యక్షుని హోదాలో అచ్చెన్న, అటువైపు ఎంఎల్సీ హోదాలో దువ్వాడ..ఇంకేమి కావలి. పసందైన రాజకీయానికి తెరలేవబోతోంది. చూద్దాం ఏం జరగబోతోందో.

This post was last modified on February 27, 2021 1:57 pm

Share
Show comments

Recent Posts

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

19 minutes ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

1 hour ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

2 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

3 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

3 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

6 hours ago