Political News

కేసీఆర్, జ‌గ‌న్‌.. ఒకటే టెన్ష‌న్‌..!!

అటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి, ఇటు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒక్క‌టే టెన్ష‌న్ ప్రారంభ‌మైందా? ఇద్ద‌రూ ఒకే విష‌యంపై ఆలోచ‌న సాగిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇదేదో నీళ్ల స‌మ‌స్యో.. మ‌రేమిటో కాదు.. ఇద్ద‌రికీ నేరుగా సంబంధించింది కాక‌పోయినా.. ఎవ‌రి రాష్ట్రాల్లో వారికి టెన్ష‌న్ గానే ఈ స‌మ‌స్య మారింది. విష‌యంలోకి వెళ్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఏపీలో తిర‌ప‌తి పార్ల‌మెంటు స్థానం, తెలంగాణ‌లో నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే..ఈ ఉప ఎన్నిక‌లు ఇరు రాష్ట్రాల‌ అధికార పార్టీలు టీఆర్ఎస్‌, వైసీపీల్లో కొత్త టెన్ష‌న్‌కు కార‌ణంగా మారాయి.

ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానంపై ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. ఇది వైసీపీకి సిట్టింగ్ సీట్‌. 2019లో విజ‌యం సాధించిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌.. అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్క‌డ ఉప పోరుకు రంగం రెడీ అవుతోంది. అయితే.. ఇది కేవ‌లం ఉప ఎన్నిక‌గానే కాకుండా.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు.. మూడు రాజ‌ధానులు.. వంటి కీల‌క అంశాల‌కు ముడిప‌డిన వ్య‌వ‌హారంగా మారింది. వాస్త‌వానికి ‌ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగుదశ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ మెజారిటీ పంచాయ‌తీలు సాధించింద‌ని చెబుతున్నా.. ఆశించిన విధంగా 90 శాతం ఏక‌గ్రీవాలు సాధించ‌లేక పోయింది.

ఇక‌, త్వ‌ర‌లోనే మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ ఓట‌రు నాడి కూడా వ్య‌తిరేకంగా ఉంద‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో తిరుపతి పార్ల‌మెంటు స్థానం ద‌క్కించుకోవడం అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర‌స్థాయిలో బెడిసికొట్టే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు దీంతో ఈ ఉప పోరు వైసీపీ లో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీస్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గనుంది. టీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన నోముల న‌ర‌సింహ‌య్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

అయితే.. ఈ ఉప ఎన్నిక‌ల కేసీఆర్‌లో టెన్ష‌న్ పెడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జ‌ర‌గ్గా అధికార పార్టీ సిట్టింగ్ సీటు కోల్పోయింది. అదేస‌మ‌యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌… మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నా.. ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌ప‌డ్డాయి. దీంతో కేసీఆర్ సాగ‌ర్‌లో గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సాగ‌ర్‌లో క‌నుక గెలుపు గుర్రం ఎక్క‌క పోతే.. కేసీఆర్‌కు వ్య‌తిరేకత ప్రారంభ‌మైంద‌నే భావించాల్సి ఉంటుంది. ఈ ప‌రిణామాల‌కు తోడు.. తాజాగా వ‌స్తున్న‌ ష‌ర్మిల పార్టీ ఆయ‌న‌కు మ‌రింత స‌వాలుగా మారనుంది. ఈ నేప‌థ్యంలో అటు ఏపీ, ఇటు తెలంగాణలో సీఎంల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 26, 2021 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

2 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

2 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

3 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

3 hours ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

4 hours ago