Political News

కేసీయార్ ను టార్గెట్ చేసిన షర్మిల

తెలంగాణాలో తొందరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల డైరెక్టుగా కేసీయార్ నే టార్గెట్ చేశారు. లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల తన స్ధానికతపై జరుగుతున్న ప్రచారానికి గట్టి రిప్లై ఇచ్చారు. తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని, తెలంగాణా కోడలనని గట్టిగానే బదులిచ్చారు. తన పిల్లలు కూడా ఇక్కడే పుట్టి పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండేది. స్ధానికతపై మాట్లాడుతూ కేసీయార్, బీజేపీ నేత విజయశాంతి స్ధానికతను ఆమె ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది.

కేసీయార్, విజయశాంతి ఎక్కడపుట్టారు ? అన్న షర్మిల ప్రశ్నకు మీడియా నుండి సమాధానమే రాలేదు. అదే ఊపులో కేసీయార్ పరిపాలనపై విమర్శలతో కూడిన ఆరోపణలు సంధించారు. గొర్రెలు, బఱ్ఱెలు ఇస్తే సరిపోతుందా ? ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు ? అంటూ పరోక్షంగా కేసీయార్ ను నిలదీశారు. కేసీయార్ ఫాం హౌస్ కు మాత్రమే పరిమితమై పరిపాలనను గాలికొదిలేశారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

కరోనా వైరస్ సమయంలో జనాలంతా అల్లాడిపోతుంటే కేసీయార్ ఏమన్నా పట్టించుకున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. రోగుల నుండి లక్షల రూపాయలు దోచుకున్న ఆసుపత్రులపైన కనీసం దృష్టి కూడా కేసీయార్ పెట్టలేదంటు ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణా అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ది లేదని తేల్చేశారు. ఒకపార్టీ ఉద్యమం అంటుంటే మరోపార్ట మతం అంటోందంటు ఒకేసారి టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఆరోగ్య శ్రీ పథకం నిర్వీర్యమైపోయిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

తొందరలోనే తాను తెలంగాణాలో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని ఎదిరించటానికైనా సిద్ధమన్నారు. తనకు తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి పోలవరం నుండి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు పోరాటం చేస్తానన్నారు. తొందరలోనే అమరవీరుల కుటుంబాలను కలుస్తానన్నారు. షర్మిల మీడియా చిట్ చాట్ చూస్తే చాలా జాగ్రత్తగానే పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది.

అవసరమైతే జగన్ను కూడా ఎదిరిస్తానని, కేసీయార్, విజయశాంతి ఎక్కడ పుట్టారని, తెలంగాణా ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అమరవీరులను కలుస్తానని చెప్పటం చూస్తుంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. దీనికంటే ముందు తెలంగాణాలో పాదయాత్ర చేస్తానని, అమరవీరులను కలుస్తానని చెప్పటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలను కేసీయార్ దూరంగా పెట్టేశారనే ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇటు కేసీయార్, అటు బీజేపీలకు సవాలు విసురుతున్నట్లే ఉంది చూస్తుంటే. చూద్దాం నాలుగు రోజుల తర్వాత ఏమవుతుందో ?

This post was last modified on February 25, 2021 11:10 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

12 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

13 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

14 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

14 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

14 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

15 hours ago