Political News

బీజేపీకి దెబ్బ మీద దెబ్బ

రాష్ట్రంలో కమలంపార్టీ పరిస్ధితి పాతాళంలో ఎక్కడో కనబడకుండా ఉంటుంది. చివరకు టార్చ్ లైట్ వేసి వెతికినా ఎక్కడా కనబడదు. అలాంటి పార్టీ నేతలు మాత్రం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని సొల్లు కబుర్లు చెబుతుంటారు. సరే ఏ పార్టీ అయినా జనాల్లోనే ఉంటే ఏదో రోజుకు ప్రజల ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ ప్రయత్నాలకు మాత్రం అలాంటి అవకాశాలు దక్కుతాయనే ఆశ ఆ పార్టీ నేతలకే లేకుండా పోయింది.

ఈ పరిస్దితికి ప్రత్యర్ధి పార్టీలు కారణం కాదు. పార్టీ జాతీయ నాయకత్వం, కేంద్రప్రభుత్వ విధానాలు కలిపి రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల అవకాశాలను పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాన్నే తీసుకుంటే జనాలకు ఏమని సమాధానం చెప్పుకోవాలో పార్టీ చీఫ్ సోమువీర్రాజుతో పాటు ఎవరికి కూడా దిక్కు తోచటం లేదు. చివరకు సమాధానాలు చెప్పుకోలేక ఉక్కు ప్రైవేటీకరణపై బీజేపీ కానీ కేంద్రప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదని, నిర్ణయం తీసుకోలేదని సొల్లు చెబుతున్నారు.

ఉక్కు ప్రైవేటీకరణ విషయమై పార్లమెంటులో స్వయంగా ఉక్కు శాఖ కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రకటన చేసిన తర్వాతే విశాఖలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇదే విషయమై అవకాశం ఉంటే నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడుదామని ఢిల్లీ వెళ్ళిన వీర్రాజు బృందానికి పెద్దగా వర్కవుటైనట్లు లేదు. దాంతో రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత జనాలకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాకే ఎదురుదాడులు మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని వదలేస్తే రాష్ట్ర విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ అంశాలను కేంద్రప్రభుత్వం గాలి కొదిలేసింది. తర్వాత పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై ముప్పుతిప్పలు పెడుతోంది. ఇలా ఏ రూపంలో చూసినా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల ప్రయత్నాలను కేంద్రభుత్వం+బీజేపీ అగ్రనాయకత్వమే అడ్డుకుంటున్నట్లుంది. మరి ఈ దశలో బీజేపీ నేతలు ఏమి చేయాలి ? చేసేదేమీ లేదు ప్రెస్ మీట్లు పెట్టుకుంటు కాలక్షేపం చేసేయటమే.

This post was last modified on February 24, 2021 3:33 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

40 mins ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

1 hour ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

1 hour ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

2 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

3 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

4 hours ago