ఒక ట్వీట్ విలువ రూ.1.10లక్షల కోట్లా? అంటే అవుననే చెప్పాలి. తాజాగా అపర కుబేరుడు చేసిన ఒక్క ట్వీట్ అతగాడి ఆస్తిని అమాంతం తగ్గేలా చేసింది. ఇంతకీ ఆ అపర కుబేరుడు ఎవరు? అతను చేసిన ట్వీట్ సారాంశం ఏమిటి? అంతలా ఆయన ఆస్తి ఎందుకు కరిగిపోయింది? అన్న వివరాల్లోకి వెళితే..
ప్రముఖ విద్యుత్ కార్ల కంపెనీ సంస్థ టెస్లా అధినేత.. ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఒక ట్వీట్ తో ఆయన ఆస్తి ఏకంగా రూ.1.10లక్షల కోట్లు ఆవిరి అయ్యేలా చేసింది. బిట్ కాయన్లపై ఆయన చేసిన ట్వీట్ తో ఇలాంటి పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎలాన్ మాస్క్ బిట్ కాయన్లకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఆయన ఈసారి నెగిటివ్ గా మట్లాడారు.
చూస్తుంటే బిట్ కాయన్.. ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అంతే.. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారటమే కాదు.. క్రిప్టో కరెన్సీ విలువ ఒక్కసారిగా ఎనిమిది శాతం కుంగిపోవటం చూస్తే.. ఆయన నోటి నుంచి వచ్చే మాటకు ఇంత విలువ ఉందా? అన్న క్వశ్చన్ మదిలో మెదలక మానదు. ఎలాన్ చేసిన ట్వీట్ తో బిట్ కాయిన్ ధర మాత్రమే కాదు.. ఆయన కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి.
2020 సెప్టెంబరు తర్వాత ఇంత కాలానికి ఇంత భారీగా టెస్లా షేర్లు పడిపోవటం గమనార్హం. అది కూడా తాను చేసుకున్న ట్వీట్ తోనే కావటం మరింత ఆసక్తికరంగా. తాజాగా పడిపోయిన ఆయన కంపెనీ షేరు విలువ మన రూపాయిల్లో రూ.1.10 లక్షల కోట్లు డిపోయింది. వాస్తవానికి క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇచ్చే ఎలాన్ మాస్క్.. రెండు వారాల క్రితం 1.5 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయన్లను కొనుగోలు చేశారు. అంతేకాదు.. తన విద్యుత్ కార్ల విక్రయానికి క్రిప్టో కరెన్సీలో చెల్లిస్తానన్నా ఓకే చెప్పనున్నారట. మొత్తంగా ఒక ట్వీట్ విలువ ఇంత ఖరీదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…