Political News

ఒక ట్వీట్ చేసి లక్ష కోట్లు పోగొట్టుకున్నాడు !

ఒక ట్వీట్ విలువ రూ.1.10లక్షల కోట్లా? అంటే అవుననే చెప్పాలి. తాజాగా అపర కుబేరుడు చేసిన ఒక్క ట్వీట్ అతగాడి ఆస్తిని అమాంతం తగ్గేలా చేసింది. ఇంతకీ ఆ అపర కుబేరుడు ఎవరు? అతను చేసిన ట్వీట్ సారాంశం ఏమిటి? అంతలా ఆయన ఆస్తి ఎందుకు కరిగిపోయింది? అన్న వివరాల్లోకి వెళితే..

ప్రముఖ విద్యుత్ కార్ల కంపెనీ సంస్థ టెస్లా అధినేత.. ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఒక ట్వీట్ తో ఆయన ఆస్తి ఏకంగా రూ.1.10లక్షల కోట్లు ఆవిరి అయ్యేలా చేసింది. బిట్ కాయన్లపై ఆయన చేసిన ట్వీట్ తో ఇలాంటి పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎలాన్ మాస్క్ బిట్ కాయన్లకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఆయన ఈసారి నెగిటివ్ గా మట్లాడారు.

చూస్తుంటే బిట్ కాయన్.. ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అంతే.. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారటమే కాదు.. క్రిప్టో కరెన్సీ విలువ ఒక్కసారిగా ఎనిమిది శాతం కుంగిపోవటం చూస్తే.. ఆయన నోటి నుంచి వచ్చే మాటకు ఇంత విలువ ఉందా? అన్న క్వశ్చన్ మదిలో మెదలక మానదు. ఎలాన్ చేసిన ట్వీట్ తో బిట్ కాయిన్ ధర మాత్రమే కాదు.. ఆయన కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

2020 సెప్టెంబరు తర్వాత ఇంత కాలానికి ఇంత భారీగా టెస్లా షేర్లు పడిపోవటం గమనార్హం. అది కూడా తాను చేసుకున్న ట్వీట్ తోనే కావటం మరింత ఆసక్తికరంగా. తాజాగా పడిపోయిన ఆయన కంపెనీ షేరు విలువ మన రూపాయిల్లో రూ.1.10 లక్షల కోట్లు డిపోయింది. వాస్తవానికి క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇచ్చే ఎలాన్ మాస్క్.. రెండు వారాల క్రితం 1.5 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయన్లను కొనుగోలు చేశారు. అంతేకాదు.. తన విద్యుత్ కార్ల విక్రయానికి క్రిప్టో కరెన్సీలో చెల్లిస్తానన్నా ఓకే చెప్పనున్నారట. మొత్తంగా ఒక ట్వీట్ విలువ ఇంత ఖరీదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on February 24, 2021 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

12 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago