Political News

పరువు నిలిపిన సొంత గ్రామం

మొత్తానికి పుట్టి పెరిగిన సొంత గ్రామం నారావారిపల్లే చంద్రబాబునాయుడు పరువు కాస్త నిలిపింది. నాలుగో విడతలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని అనేక పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అయితే చంద్రబాబు పుట్టి పెరిగిన సొంతగ్రామం నారావారి పల్లె పంచాయితిలో మాత్రం టీడీపీ మద్దతుదారే గెలిచారు. ఇక్కడ తెలుగుదేశంపార్టీ మద్దతుదారు పోటీ చేసిన లక్ష్మి సమీప అభ్యర్ధిపై 563 ఓట్ల మెజారిటితో గెలిచారు.

నారావారి పల్లెలో వైసీపీ జెండా ఎగురవేయాలని అధికారపార్టీ నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ పంచాయితిలో గెలుపు కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, ఎంతమంది నేతలను రంగంలోకి దింపినా ఇక్కడ టీడీపీ అభ్యర్ధే గెలవటం విశేషం. నియోజకవర్గంలోని చాలా పంచాయితీల్లో మళ్ళీ వైసీపీ మద్దతుదారులే గెలిచారు.

మొన్నటి మూడో విడత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయితీల్లో వైసీపీ మద్దుతుదారులే గెలిచారు. ఇక్కడ 89 పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు 74 చోట్ల గెలిస్తే టీడీపీ గెలిచింది కేవలం 14 పంచాయితీల్లో మాత్రమే. కుప్పం నియోజకవర్గంలో ఏకంగా వైసీపీ 74 పంచాయితీల్లో గెలవటం గడచిన 30 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి. ఎన్నిక ఏదైనా సరే టీడీపీ తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలుపు ఖాయమే అన్నట్లుండేది పరిస్దితి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్ధితుల్లో బాగా మార్పు వచ్చేసింది. మొత్తానికి కుప్పంలో పంచాయితీల్లో ఓడిపోయినా కనీసం పుట్టి పెరిగిన సొంత గ్రామపంచాయితీ నారావారి పల్లెలో అయినా టీడీపీ తన పట్టు నిలుపుకోవటం సంతోషించాల్సిన విషయమే. పంచాయితీ ఎన్నికల్లోనో లేకపోతే స్ధానిక ఎన్నికల్లోనో గెలిచినంత మాత్రాన ఏమీ అయిపోదు. పార్టీ పటిష్టానికి గ్రౌండ్ లెవల్ నుండి కష్టపడితే మళ్ళీ పార్టీ బలోపేతమవటం పెద్ద కష్టంకాదు.

This post was last modified on February 22, 2021 11:50 am

Share

Recent Posts

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

2 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

9 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

9 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

10 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

10 hours ago