మొత్తానికి పుట్టి పెరిగిన సొంత గ్రామం నారావారిపల్లే చంద్రబాబునాయుడు పరువు కాస్త నిలిపింది. నాలుగో విడతలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని అనేక పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అయితే చంద్రబాబు పుట్టి పెరిగిన సొంతగ్రామం నారావారి పల్లె పంచాయితిలో మాత్రం టీడీపీ మద్దతుదారే గెలిచారు. ఇక్కడ తెలుగుదేశంపార్టీ మద్దతుదారు పోటీ చేసిన లక్ష్మి సమీప అభ్యర్ధిపై 563 ఓట్ల మెజారిటితో గెలిచారు.
నారావారి పల్లెలో వైసీపీ జెండా ఎగురవేయాలని అధికారపార్టీ నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ పంచాయితిలో గెలుపు కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, ఎంతమంది నేతలను రంగంలోకి దింపినా ఇక్కడ టీడీపీ అభ్యర్ధే గెలవటం విశేషం. నియోజకవర్గంలోని చాలా పంచాయితీల్లో మళ్ళీ వైసీపీ మద్దతుదారులే గెలిచారు.
మొన్నటి మూడో విడత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయితీల్లో వైసీపీ మద్దుతుదారులే గెలిచారు. ఇక్కడ 89 పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు 74 చోట్ల గెలిస్తే టీడీపీ గెలిచింది కేవలం 14 పంచాయితీల్లో మాత్రమే. కుప్పం నియోజకవర్గంలో ఏకంగా వైసీపీ 74 పంచాయితీల్లో గెలవటం గడచిన 30 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి. ఎన్నిక ఏదైనా సరే టీడీపీ తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలుపు ఖాయమే అన్నట్లుండేది పరిస్దితి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్ధితుల్లో బాగా మార్పు వచ్చేసింది. మొత్తానికి కుప్పంలో పంచాయితీల్లో ఓడిపోయినా కనీసం పుట్టి పెరిగిన సొంత గ్రామపంచాయితీ నారావారి పల్లెలో అయినా టీడీపీ తన పట్టు నిలుపుకోవటం సంతోషించాల్సిన విషయమే. పంచాయితీ ఎన్నికల్లోనో లేకపోతే స్ధానిక ఎన్నికల్లోనో గెలిచినంత మాత్రాన ఏమీ అయిపోదు. పార్టీ పటిష్టానికి గ్రౌండ్ లెవల్ నుండి కష్టపడితే మళ్ళీ పార్టీ బలోపేతమవటం పెద్ద కష్టంకాదు.
This post was last modified on February 22, 2021 11:50 am
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…