Political News

పాద‌యాత్ర మిగిల్చిన ప‌దునైన ప్ర‌శ్న‌లు.. సాయిరెడ్డికి స‌వాలే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు.. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సాగించిన పాద‌యాత్ర స‌క్సెస్ అయిందా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. అనేక ప్రశ్న‌ల‌ను మాత్రం ఆయ‌న‌కు మిగిల్చింద‌నేది వాస్త‌వం. ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేపట్టిన సాయిరెడ్డి.. వైసీపీ నేతలు, శ్రేణులు, సామాన్య ప్రజలతో గాజువాక వ‌ర‌కు త‌న యాత్ర‌ను సాగించారు. గాజువాక ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటు నినాదాలు చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనివ‌ల్ల వ‌చ్చే ఫ‌లితం ఏంట‌నేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాం శంగా మారింది.

ఎందుకంటే.. విజ‌య‌సాయి రెడ్డి చేసిన పాద‌యాత్ర వ‌ల్ల స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణ యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకునే అవ‌కాశం లేద‌న్న‌ది ఏపీ ప్ర‌జ‌ల‌కే కాదు.. అంద‌రికీ తెలిసిన విష‌యం. కేంద్రం ఒక నిర్ణ‌యం తీసుకుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వెన‌క్కి తీసుకున్న దాఖ‌లాలు లేవు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌న‌ని చెప్పింది. దీనిపై ఎంత మంది ఎన్ని రూపాల్లో విజ్ఞ‌ప్తులు చేసినా.. ఆందోళ‌న‌లు చేసినా, తిట్టినా.. స్పందించ‌లేదు.

ఇక‌, రైతుల‌కు సంబందించిన సాగు చ‌ట్టాల‌పైనా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో సాయిరెడ్డి పాద‌యాత్ర కూడా ఒక మిష‌గానే మిగిలిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి పాద‌యాత్ర ద్వారా విశాఖ ఉక్కును సాధించ‌లేమ‌ని.. సాయిరెడ్డికి కూడా తెలుసు.

అయితే.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. రాజీనామా చేయ‌డం, ప‌ల్లా శ్రీనివాస‌రావు.. ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూర్చోవ‌డం వంటివి పెద్ద ఎత్తున హైలెట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ వెనుక‌బ‌డింద‌నే కామెంట్లు వ‌చ్చాయి. వీటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డంతోపాటు.. విశాఖ‌లో వైసీపీ వెనుక‌బ‌డితే..త‌న‌కు బ్యాడ్ నేమ్ వ‌చ్చే అవ‌కాశంతో పాటు.. ప్ర‌స్తు తం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌ని.. ఫ‌లితంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న‌కు మార్కులు త‌గ్గుతాయ‌ని గుర్తించిన సాయి రెడ్డి.. పాద‌యాత్ర‌కు రెడీ అయ్యార‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు పాద‌యాత్ర అయితే.. చేశారు. కానీ, అత్యంత కీల‌క‌మైన ఫ‌లితాన్ని మాత్రం ఆయ‌న రాబ‌ట్ట‌లేక పోగా.. సాయిరెడ్డి చేసిన యాత్ర కేవ‌లం రాజ‌కీయ యాత్ర‌కు మాత్ర‌మే ప‌నికి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 21, 2021 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago