తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంటోంది. ఇలాంటి ఘటనల పరంపరలో బుధవారం నాడు వాటన్నింటిని తలదన్నెలా ఓ ఘటన జరిగింది. దివంగత సీఎం వైఎఎస్ రాజశేఖరరెడ్డి సేవకుడిగా ఆయన వెన్నంటే నడిచిన సూరీడు అలియాస్ సూర్యనారాయణ రెడ్డి… వైఎస్ కు వైరి వర్గం టీడీపీలో ఏళ్ల తరబడి సాగి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ సభా వేదికపైకి ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సూరీడు… అంతటితో ఆగకుండా రేవంత్ లో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
రేవంత్ రెడ్డి… వైఎస్ బతికున్నంత కాలం టీడీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వారే అయినప్పటికీ ఇద్దరిదీ భిన్న మార్గమే. వైఎస్ చనిపోయే దాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే… రేవంత్ టీడీపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి వైఎస్ మరణం తర్వాత, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన చాలా కాలానికి కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీకి, రేవంత్ కు ఏనాడూ మిత్రుత్వమన్నదే లేదనే చెప్పాలి. అలాంటిది వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగానే కాకుండా వైఎస్ బతికున్నంత కాలం ఆయన వెన్నంటి నడిచిన సూరీడు.. ఇప్పుడు రేవంత్ వద్ద కనిపించడం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే కదా.
వైఎస్ చనిపోయేదాకా ఆయన వెన్నంటే ఉన్న సూరీడు… చివరి దాకా వైఎస్ ఫ్యామిలీకి దూరంగా జరిగే వ్యక్తి కాదన్న మాటలు గట్టిగానే వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా.. సెక్రటేరియట్ లో ఓ సారి కనిపించిన సూరీడు అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా టీడీపీ హయాంలో మంత్రిగా కొనసాగిన దేవినేని ఉమామహేశ్వరరావుతోనూ ఆయన భేటీ అయిన సంగతీ తెలిసిందే. మొత్తంగా వైఎస్ మరణానంతరం ఆ ఫ్యామిలీకి సూరీడు దూరం జరుగుతున్నట్లుగానే కనిపించారు. తాజాగా తెలంగాణలో కొత్త పార్టీ దిశగా వైఎస్ కుమార్తె షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్న క్రమంలో అక్కడి రెడ్డి సామాజిక వర్గమంతా ఆమె పార్టీలో చేరిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విశ్లేషణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో సూరీడు ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.
This post was last modified on February 18, 2021 7:49 am
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…