తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంటోంది. ఇలాంటి ఘటనల పరంపరలో బుధవారం నాడు వాటన్నింటిని తలదన్నెలా ఓ ఘటన జరిగింది. దివంగత సీఎం వైఎఎస్ రాజశేఖరరెడ్డి సేవకుడిగా ఆయన వెన్నంటే నడిచిన సూరీడు అలియాస్ సూర్యనారాయణ రెడ్డి… వైఎస్ కు వైరి వర్గం టీడీపీలో ఏళ్ల తరబడి సాగి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ సభా వేదికపైకి ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సూరీడు… అంతటితో ఆగకుండా రేవంత్ లో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
రేవంత్ రెడ్డి… వైఎస్ బతికున్నంత కాలం టీడీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వారే అయినప్పటికీ ఇద్దరిదీ భిన్న మార్గమే. వైఎస్ చనిపోయే దాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే… రేవంత్ టీడీపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి వైఎస్ మరణం తర్వాత, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన చాలా కాలానికి కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీకి, రేవంత్ కు ఏనాడూ మిత్రుత్వమన్నదే లేదనే చెప్పాలి. అలాంటిది వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగానే కాకుండా వైఎస్ బతికున్నంత కాలం ఆయన వెన్నంటి నడిచిన సూరీడు.. ఇప్పుడు రేవంత్ వద్ద కనిపించడం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే కదా.
వైఎస్ చనిపోయేదాకా ఆయన వెన్నంటే ఉన్న సూరీడు… చివరి దాకా వైఎస్ ఫ్యామిలీకి దూరంగా జరిగే వ్యక్తి కాదన్న మాటలు గట్టిగానే వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా.. సెక్రటేరియట్ లో ఓ సారి కనిపించిన సూరీడు అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా టీడీపీ హయాంలో మంత్రిగా కొనసాగిన దేవినేని ఉమామహేశ్వరరావుతోనూ ఆయన భేటీ అయిన సంగతీ తెలిసిందే. మొత్తంగా వైఎస్ మరణానంతరం ఆ ఫ్యామిలీకి సూరీడు దూరం జరుగుతున్నట్లుగానే కనిపించారు. తాజాగా తెలంగాణలో కొత్త పార్టీ దిశగా వైఎస్ కుమార్తె షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్న క్రమంలో అక్కడి రెడ్డి సామాజిక వర్గమంతా ఆమె పార్టీలో చేరిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విశ్లేషణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో సూరీడు ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.
This post was last modified on February 18, 2021 7:49 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…