ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు ప్రైవేటు పరం చేసేందుకు వేగంగా పావులు కదపటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు సంబంధించి బాధ్యత మీదంటే మీదంటూ ఏపీ అధికార.. విపక్ష నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం తెలిసిందే. మీ వైఫల్యం వల్లే ఇదంతా అని ఇరు పక్షాలు పోటీపడి మరి తిట్టేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహిస్తే.. ఆయన వెంట నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా అచ్చెన్న పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం జగన్ వెంట నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అవసరమైతే అందరం కలిసి రాజీనామా చేద్దామని పిలుపునిచ్చారు. ఉక్కుపోరులో ఎంపీలు రాజీనామా చేస్తే.. వారి స్థానాల్లో పోటీ పెట్టబోమని అచ్చెన్న హామీ ఇచ్చారు.
ఓవైపు జగన్ తో కలిసి నడిచేందుకు సిద్ధమన్న అచ్చెన్న.. మరోవైపు ఆయనపై పలు విమర్శలు.. ఆరోపణలు చేయటం గమనార్హం. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కర్త.. కర్మ.. క్రియ మొత్తం ముఖ్యమంత్రి జగనేనని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉక్కు ఉద్యమాన్ని మరింత పెద్దది చేస్తామన్నారు. మరి..దీనికి వైసీపీ నేతల స్పందన ఏమిటో చూడాలి.
This post was last modified on February 16, 2021 10:42 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…