Political News

నిమ్మగడ్డ తెల్లజెండా చూపించినట్లేనా ?

ఒకపుడు యుద్ధాల్లో సంధి చేసుకోవాలని అనుకున్నపుడు శతృవులు తెల్లజెండాను చూపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత విషయానికి వస్తే కొద్ది రోజులుగా ఉప్పు-నిప్పులాగున్న ప్రభుత్వం యంత్రాంగం, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ మధ్య కూడా సయోధ్య కుదిరినట్లే ఉంది. ఎందుకంటే పంచాయితి ఎన్నికల మొదటి విడతలో యంత్రాంగం బాగా పనిచేసిందని నిమ్మగడ్డ ప్రశంసిచారు.

తొలిదశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నిమ్మగడ్డ అభినందించారు. ఇదే చీఫ్ సెకట్రరీకి నిమ్మగడ్డకు మధ్య ఎన్నిసార్లు లేఖల యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ యుద్ధం కూడా చాలా తీవ్రస్ధాయిలోనే జరిగింది. తన ఆదేశాలను పాటించాల్సిందే అని నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయటం ఆ ఆదేశాలు ఇచ్చే అధికారం నిమ్మగడ్డకు లేదని కొన్ని సందర్భాల్లో చీఫ్ సెక్రటరీ రిప్లై ఇవ్వటం అందరికీ తెలిసిందే.

మొత్తం మీద ఉప్పు-నిప్పు లాగున్న చీఫ్ సెక్రటరి, నిమ్మగడ్డ మధ్య ఆహ్లదకరమైన వాతావరణంలో భేటి జరిగింది. ఈ భేటీలో డీజీపీతో పాటు కొందరు అధికారులు పాల్గొన్నారు. మిగిలిన మూడు విడతల పంచాయితి ఎన్నికల నిర్వహణపై చేసిన చేయాల్సిన ఏర్పాట్లపై భేటీలో చర్చించినట్లు సమాచారం. ఏకపక్షంగా నిమ్మగడ్డ ఇచ్చిన కొన్ని ఆదేశాలను అమలు చేయటానికి చీఫ్ సెక్రటరీ నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే.

మొత్తం మీద మార్చి నెల 31వ తేదీన రిటైర్ అవుతున్న నిమ్మగడ్డ కు తత్వం బోధపడినట్లే ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదని అర్ధమైపోయింది. దానికితోడు కోర్టుల్లో కూడా వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బల వల్ల కూడా నిమ్మగడ్డ తన రూటును మార్చుకున్నట్లున్నారు. కారణాలు ఏమైనా సుహ్రుద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకోవటం తప్పేకాదు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

3 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

4 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

4 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

4 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

5 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

7 hours ago