Political News

షర్మిల వెనుక పీకే.. నిజమెంత?

ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం రాజకీయాల్లో అలవాటే. దానికి నిదర్శనంగా తాజాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేయటం. మీడియాలో వచ్చిన వార్తల్ని నిజం చేస్తూ.. నల్గొండతో పాటు పలు జిల్లాలకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్ని.. ఆయన్ను బలంగా నమ్మే నేతల్ని ఆహ్వానించిన షర్మిల.. తెలంగాణలో తన పొలిటికల్ ఎంట్రీ మీద స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారని చెప్పాలి.

షర్మిల ఒక్కరే ఇంతటి సాహసం చేయగలరా? అందునా.. అన్న జగన్ తో విభేదించి ఒక్కతే రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేయటమా? అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పక్కా ప్లానింగ్ తోనే రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాలు.. సూచనలతోనే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.

తన సోదరి పార్టీ పెట్టే విషయంపై పీకేతో సీఎం జగన్ చర్చించినట్లు చెబుతారు. షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందని.. ఆ రాష్ట్రంలో ప్రభావాన్ని చూపించటానికి అవకాశం ఉందన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే కొత్త పార్టీ పెట్టాలన్న షర్మిల ఆకాంక్షకు పీకే మద్దతు ఇచ్చినట్లుగా సమాచారం.

తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ప్రస్తుతం మమతా బెనర్జీకి సేవలు అందిస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఆ ఎన్నికలు అయ్యాక తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ చేస్తారని.. షర్మిలను 2023లో జరిగే ఎన్నికలకు సిద్ధం చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. రాజకీయంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on February 10, 2021 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago