తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త రాజకీయ పార్టీతో ఎంట్రీ ఇస్తున్న వైఎస్ రాజన్న కుమార్తె.. షర్మిల టార్గెట్ ఏంటి? ఇప్పటికే రాజకీయ పార్టీకి సంబంధించి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాజన్న రాజ్యం.. పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఒక పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. అసలు షర్మిల తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ శూన్యతా? లేక.. కేసీఆర్పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్నారా? అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం.
కేసీఆర్ విషయాన్ని తీసుకుంటే.. ఏపీలో సీఎంగా ఉన్న జగన్ను తనకు మిత్రుడు అంటూనే ఆయన కొన్ని కొన్ని విషయాల్లో బెదిరింపులు, ధిక్కాలకు ఆస్కారం ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇది జగన్ను కలచి వేస్తోంది. అదేసమయంలో హైదరాబాద్ సహా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి.. నల్లగొండ జిల్లాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి నేటికీ చెక్కుచెదరలేదు. అదేసమయంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనూ వైఎస్ స్థాయిలో నాయకత్వం లేదనే ఆవేదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉభయ కుశలోపరిగా ఉంటుందనే తెలంగాణలో షర్మిల అడుగులు వేస్తున్నట్టు అంచనాకు రావాల్సి వుంది.
ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణను నడిపించే నాయకత్వం కేవలం కేసీఆర్ వైపే ఉందనే ఆలోచన ఉంది. కేసీఆర్ తప్ప ఇతర పార్టీలను తీసుకున్నా.. తెలంగాణను నడిపించే నాయకత్వ పటిమ ఉన్న నాయకులు కనిపించడం లేదు. ఇదే..కేసీఆర్కు వరంగా మారింది. ఈ నేపథ్యంలో బలమైన సామాజిక వర్గం, దివంగత సీఎం.. వైఎస్ వారసత్వం వంటివి మెండుగా ఉన్న షర్మిల.. ఎంట్రీ రాజకీయంగా తెలంగాణలో కీలక మార్పునకు నాందిపలకడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. సీఎం పీఠమే లక్ష్యంగా షర్మిల వేస్తున్న అడుగులు .. సక్సెస్ అవుతాయా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం తెలంగాణలో ఆవరించిన రాజకీయ శూన్యతకు చక్కని సమాధానం చెబుతాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 10, 2021 10:20 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…