తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు బీజేపీ-కాంగ్రెస్ల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న తెలంగాణ సారథి..కేసీఆర్కు వైఎస్ షర్మిల రాజకీయ ఎంట్రీ ఒక పెద్ద కుదుపుగానే భావించాలి. షర్మిల ఎంట్రీని ఏదో ఆషామాషీగానో.. గతంలో నరేంద్ర, విజయశాంతి వంటివారు తీసుకువచ్చిన పార్టీల మాదిరిగానో తీసిపారేసే పరిస్థితి కేసీఆర్కు లేనేలేదు. రాజకీయంగా.. ప్రజా క్షేత్రంలో బలమైన బ్యాక్ గ్రౌండ్ లేని వారికి.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్నిపుణికి పుచ్చుకుని రంగంలోకి దిగుతున్న షర్మిలకు చాలా తేడా ఉంది.
హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ తనదైన ముద్ర వేశారు. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సహా హైదరాబాద్కు మణిహారం వంటి రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ వే.. ఇలా అనేక రూపాల్లో వైఎస్ తనదైన ముద్ర వేసుకున్నారు. అదేసమయంలో తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నేడు ఏ సాగునీటి ప్రాజెక్టుల జపం చేస్తున్నారో.. వాటిలో .. వైఎస్ పాలనలో శంకు స్థాపన చేసుకున్నవే అధికం(ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట కేసీఆర్ తన నోటితోనే చెప్పుకొచ్చారు) ఇక, షర్మిలకు తన అన్న జైల్లో ఉన్నసమయంలో చేసిన పాదయాత్ర పెద్ద ఎస్సర్ట్ అనే చెప్పాలి.
ఈ పరిణామాలను గమనిస్తే. అటు ఏపీలో అన్న జగన్.. ఇటు తెలంగాణలో సోదరి షర్మిల దూకుడు.. వ్యూహాలు కేసీఆర్కు ఉక్కిరి బిక్కిరి చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బహుశ ఈ పర్యవసానాలను ఆయన గ్రహించే ఉండి ఉంటారు. అందుకే ఇంకా పురుడు కూడా పోసుకోని పార్టీ గురించి.. వ్యాఖ్యలు చేయడం.. ఆయనలో ఉన్న భీతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. షర్మిల ప్రచారం కూడా తారస్థాయిలో ఉంటుంది. వాక్పటిమ.. సమస్యలపై సూటిగా స్పందించే లక్షణం.. కూడా కేసీఆర్ తో సమాన స్థాయిలో ఉంటాయి.
ఇక ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటు కూడా కేసీఆర్కు కలిసి వస్తుందని చెప్పలేం. ఎందుకంటే.. అది ముగిసిన ముచ్చట. ఇప్పుడు కావాల్సింది.. అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం. ఈ రెండే షర్మిలకు ప్రధాన అస్త్రాలు కానున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో అన్నా చెల్లెళ్లు వ్యూహాత్మకంగానే తెలంగాణలో పాగా వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 9, 2021 2:29 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…