తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు బీజేపీ-కాంగ్రెస్ల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న తెలంగాణ సారథి..కేసీఆర్కు వైఎస్ షర్మిల రాజకీయ ఎంట్రీ ఒక పెద్ద కుదుపుగానే భావించాలి. షర్మిల ఎంట్రీని ఏదో ఆషామాషీగానో.. గతంలో నరేంద్ర, విజయశాంతి వంటివారు తీసుకువచ్చిన పార్టీల మాదిరిగానో తీసిపారేసే పరిస్థితి కేసీఆర్కు లేనేలేదు. రాజకీయంగా.. ప్రజా క్షేత్రంలో బలమైన బ్యాక్ గ్రౌండ్ లేని వారికి.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్నిపుణికి పుచ్చుకుని రంగంలోకి దిగుతున్న షర్మిలకు చాలా తేడా ఉంది.
హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ తనదైన ముద్ర వేశారు. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సహా హైదరాబాద్కు మణిహారం వంటి రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ వే.. ఇలా అనేక రూపాల్లో వైఎస్ తనదైన ముద్ర వేసుకున్నారు. అదేసమయంలో తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నేడు ఏ సాగునీటి ప్రాజెక్టుల జపం చేస్తున్నారో.. వాటిలో .. వైఎస్ పాలనలో శంకు స్థాపన చేసుకున్నవే అధికం(ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట కేసీఆర్ తన నోటితోనే చెప్పుకొచ్చారు) ఇక, షర్మిలకు తన అన్న జైల్లో ఉన్నసమయంలో చేసిన పాదయాత్ర పెద్ద ఎస్సర్ట్ అనే చెప్పాలి.
ఈ పరిణామాలను గమనిస్తే. అటు ఏపీలో అన్న జగన్.. ఇటు తెలంగాణలో సోదరి షర్మిల దూకుడు.. వ్యూహాలు కేసీఆర్కు ఉక్కిరి బిక్కిరి చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బహుశ ఈ పర్యవసానాలను ఆయన గ్రహించే ఉండి ఉంటారు. అందుకే ఇంకా పురుడు కూడా పోసుకోని పార్టీ గురించి.. వ్యాఖ్యలు చేయడం.. ఆయనలో ఉన్న భీతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. షర్మిల ప్రచారం కూడా తారస్థాయిలో ఉంటుంది. వాక్పటిమ.. సమస్యలపై సూటిగా స్పందించే లక్షణం.. కూడా కేసీఆర్ తో సమాన స్థాయిలో ఉంటాయి.
ఇక ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటు కూడా కేసీఆర్కు కలిసి వస్తుందని చెప్పలేం. ఎందుకంటే.. అది ముగిసిన ముచ్చట. ఇప్పుడు కావాల్సింది.. అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం. ఈ రెండే షర్మిలకు ప్రధాన అస్త్రాలు కానున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో అన్నా చెల్లెళ్లు వ్యూహాత్మకంగానే తెలంగాణలో పాగా వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 9, 2021 2:29 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…