తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు బీజేపీ-కాంగ్రెస్ల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న తెలంగాణ సారథి..కేసీఆర్కు వైఎస్ షర్మిల రాజకీయ ఎంట్రీ ఒక పెద్ద కుదుపుగానే భావించాలి. షర్మిల ఎంట్రీని ఏదో ఆషామాషీగానో.. గతంలో నరేంద్ర, విజయశాంతి వంటివారు తీసుకువచ్చిన పార్టీల మాదిరిగానో తీసిపారేసే పరిస్థితి కేసీఆర్కు లేనేలేదు. రాజకీయంగా.. ప్రజా క్షేత్రంలో బలమైన బ్యాక్ గ్రౌండ్ లేని వారికి.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్నిపుణికి పుచ్చుకుని రంగంలోకి దిగుతున్న షర్మిలకు చాలా తేడా ఉంది.
హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ తనదైన ముద్ర వేశారు. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సహా హైదరాబాద్కు మణిహారం వంటి రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ వే.. ఇలా అనేక రూపాల్లో వైఎస్ తనదైన ముద్ర వేసుకున్నారు. అదేసమయంలో తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నేడు ఏ సాగునీటి ప్రాజెక్టుల జపం చేస్తున్నారో.. వాటిలో .. వైఎస్ పాలనలో శంకు స్థాపన చేసుకున్నవే అధికం(ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట కేసీఆర్ తన నోటితోనే చెప్పుకొచ్చారు) ఇక, షర్మిలకు తన అన్న జైల్లో ఉన్నసమయంలో చేసిన పాదయాత్ర పెద్ద ఎస్సర్ట్ అనే చెప్పాలి.
ఈ పరిణామాలను గమనిస్తే. అటు ఏపీలో అన్న జగన్.. ఇటు తెలంగాణలో సోదరి షర్మిల దూకుడు.. వ్యూహాలు కేసీఆర్కు ఉక్కిరి బిక్కిరి చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బహుశ ఈ పర్యవసానాలను ఆయన గ్రహించే ఉండి ఉంటారు. అందుకే ఇంకా పురుడు కూడా పోసుకోని పార్టీ గురించి.. వ్యాఖ్యలు చేయడం.. ఆయనలో ఉన్న భీతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. షర్మిల ప్రచారం కూడా తారస్థాయిలో ఉంటుంది. వాక్పటిమ.. సమస్యలపై సూటిగా స్పందించే లక్షణం.. కూడా కేసీఆర్ తో సమాన స్థాయిలో ఉంటాయి.
ఇక ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటు కూడా కేసీఆర్కు కలిసి వస్తుందని చెప్పలేం. ఎందుకంటే.. అది ముగిసిన ముచ్చట. ఇప్పుడు కావాల్సింది.. అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం. ఈ రెండే షర్మిలకు ప్రధాన అస్త్రాలు కానున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో అన్నా చెల్లెళ్లు వ్యూహాత్మకంగానే తెలంగాణలో పాగా వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 9, 2021 2:29 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…