వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే! దీనికి సంబంధించిన సన్నాహక సమావేశానికి తొలి అడుగు పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్లోని వైసీపీ ఒకప్పటి కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్కు చేరుకున్న షర్మిల.. ఆదిత్యం.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపించారని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో జయ కూడా అచ్చు ఇలానే వ్యవహరించారు. ఎంజీఆర్ మరణం తర్వాత.. పార్టీని తనవైపు తిప్పుకొన్న జయ.. అనూహ్యంగా ఎదిగారు.
ఈ క్రమంలో ఆమె తొలి భేటీ ఏర్పాటు చేసినప్పుడు.. అచ్చు ఇంతే గోప్యత పాటించారని.. అప్పటి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం షర్మిల కూడా అచ్చు జయలలితను తలపించారని చెబుతున్నారు. వైట్ శారీ ధరించిన షర్మిల.. ఆకుపచ్చ-లైట్ నీలం రంగు కలగలిసన పువ్వులతో ఉన్న బోర్డర్ ఉన్న చీరను ధరించారు. అదేవిధం వైట్ బ్లౌజ్ ధరించారు. అప్పట్లో జయలలిత కూడా అచ్చు ఇలాంటి చీరనే కట్టుకున్నారు. వైట్ శాంతికి చిహ్నం కాగా, ఆకుపచ్చ.. రంగు.. సౌభ్రాతృత్వానికి ప్రతీకగా పేర్కొంటారు. ఇక, లైట్ నీలం(స్కై బ్లూ) రంగు.. మానవత్వానికి ప్రతీక.
ఇలాంటి చీరను అప్పట్లో జయ ధరించడం విశేషం. ఇక, పలకరింపులోనూ అచ్చు జయను పోలి ఉన్నారు షర్మిల. ఎడం చేయిని గాలిలోకి ఊపు తూ.. రెండు చేతులు ఎత్తి తన అభిమానులకు నమస్కారం చేశారు. అప్పట్లో జయ కూడా అచ్చు ఇలానే చేశారు. అదేవిధంగా విజయ సంకేతంగా పేర్కొనే రెండు వేళ్లను గాలిలోకి ఊపుతూ.. అభిమానులను పలకరించారు షర్మిల. చెరగని చిరునవ్వుతో.. అభిమానులను ఉద్దేశించి.. పలకరింపుగా వ్యవహరించారు.
ఇక, జుట్టు విషయానికి వచ్చినా.. ఆనాడు జయ అవలంబించిన తీరులోనే షర్మిల వ్యవహరించారు. జడ వేసుకోకుండా.. విరబోసుకున్న కురులకు.. చివరన ముడి వేసుకున్నారు. ఆనాడు జయలలిత కూడా ఇలాంటి కురులతోనే ఉండడం గమనార్హం. ఇలా అనేక పోలికలు.. జయలలితను పోలి ఉండడంతో షర్మిల ఎంట్రీ అత్యంత ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 9, 2021 1:59 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…