ఇపుడు చేస్తున్న బోయపాటి శ్రీనివాస్ తో సినిమా అయిపోగానే తాను రోడ్డెక్కబోతున్నట్లు టీడీపీ నేత, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ చెప్పారు. నెల్లూరు జిల్లా అభిమానులతో బాలయ్య ఫోన్లో చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది. తాను రోడ్డెక్కగానే తన అసలు రూపం చూపిస్తానని చెప్పారు. మామూలుగా బాలయ్య మాట్లాడితేనే అర్ధమయ్యేది అంతంత మాత్రం. అలాంటిది రోడ్లపైకి వస్తా, అసలు అవతారం ఏమిటో చూపిస్తానని వార్నింగులు ఇస్తున్నారంటే ఏ అజెండా పెట్టుకున్నారో అర్ధం కావటంలేదు.
పైగా వైసీపీ ఇపుడు చేస్తున్నదానికి 100 రెట్లు చేసి చూపుదామని అనటం దేనికి సంకేతమో ఎవరికీ అర్ధం కావటం లేదు. వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలాగ మారిపోయిందని సినిమా డైలాగ్ ఒకటి కొట్టేశారు. శ్రీరాముడికి 14 ఏళ్ళ వనవాసం ఎలాగో తనకు అంతే అని చెప్పిన డైలాగ్ అర్ధం ఏమిటో ఎవరికీ అర్ధంకాలేదు. ‘నేనేమిటో నా కెపాసిటి ఏమిటో అందరికీ చూపిస్తా’నని బాలయ్య భారీ డైలాగే చెప్పేశారు.
ఇంకా విచిత్రమేమిటంటే తాను అన్నింటికీ సిద్ధపడే మానసికంగా ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పటం. దేనికైనా రెడీ అని ప్రాణత్యాగానికి కూడా తాను వెనకాడేది లేదని చెప్పటమేమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ చెప్పారు. ఇందుకు తాను మానసికంగా సిద్ధమవుతున్నారట. బాలయ్య ప్రాణత్యాగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు.
మొత్తానికి నందమూరి వంశాకురం అసందర్భంగా చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు విన్న తర్వాత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. పైగా దేనికీ భయపడవద్దని ఇంతకాలం అయ్యిందేదో అయిపోయిందని దేన్ని ఉద్దశించి అన్నారో కూడా అభిమానులకు అర్ధం కావటం లేదు. మొత్తానికి మామూలుగానే బాలయ్య మాట్లాడేది ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పేసి పూర్తి సమయాన్ని రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకే పరిమితమైపోతే నేతల రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలి.
This post was last modified on February 8, 2021 11:08 am
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…