Political News

జ‌గ‌న్‌కు భారీ షాక్‌: విఫ‌ల‌మైన కీల‌క ప‌థ‌కం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కీల‌క ప‌థ‌కాల‌ను ఆయ‌న అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప‌థ‌కం.. ఇంటింటికీ రేష‌న్ పంపిణీ. వైసీపీ నేత‌లు, సీఎం జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే.. ఈ ప‌థ‌కం దేశంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా అమ‌లు చేయ‌లేదు. నిజ‌మే! ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటింటికీ.. రేష‌న్‌ను పంపిణీ చేయ‌లేదు. బ‌హుశ ఇది సాధ్యం కాద‌ని.. ఆయా రాష్ట్రాలు ఎప్పుడో గుర్తించి ఉంటాయి. కానీ, ఏపీలో మాత్రం జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

సుమారు 9270 వాహ‌నాల‌ను కొనుగోలు చేసి.. యువ‌త‌కు అప్ప‌గించారు. నెల‌కు 1800 మంది ల‌బ్ధి దారుల‌కు 1వ తారీకు నుంచి 15వ తారీకులోపు రేష‌న్ స‌రుకుల‌ను ఇంటి ముందుకే తీసుకువెళ్లాల‌ని నిర్దేశించారు. ఇది పైకి చెప్ప‌డానికి, ప్ర‌చారం చేసుకునేందుకు చాలా బాగానే ఉంది. ముఖ్యంగా ఈప‌థ‌కం నుంచి జ‌గ‌న్ చాలా నే ఆశించారు. ఓటు బ్యాంకు విష‌యంలో సానుభూతి త‌న‌కు పెరుగుతుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే అప్పు చేసి మ‌రీ వాహ‌నాలు కొన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 1 నుంచే ప్రారంభించాల‌ని అనుకున్నారు. అయితే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహ‌నాల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ బ్రేకులు వేశారు.

ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో రెండు రోజ‌లు కింద‌ట ఈ కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు మంత్రి కొడాలి నాని. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రిగా ఈయ‌నకు కూడా ఈ ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేసుకోవ‌డం అత్యంత కీల‌కం. అయితే.. క్షేత్ర‌స్థాయిలో రెండు రోజుల్లోనే ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. కీల‌క‌మైన‌.. ఐదు విధుల‌ను ఒక్క‌రే చేసేందుకు డ్రైవ‌ర్లు అంగీక‌రించ‌డం లేదు. నేను ఒక్క‌డినే అన్నీ చూసుకోవాలి. డ్రైవింగ్ నేనే చేసుకోవాలి. బియ్యం బ‌స్తాల‌ను స్టాక్ పాయింట్ నుంచి నేనే మోసి.. బండిలో వేసుకోవాలి. వాటిని ఇంటింటికీ చేర్చాలి. రెండో అంత‌స్థులోనో మూడో అంత‌స్థులోనో(ఇందిర‌మ్మ గృహాలు) ల‌బ్ధి దారులు ఉంటే.. అక్క‌డ కి చేర్చాలి. ఇక‌, ఈ పోస్ మిష‌న్ ఆప‌రేట్ చేసుకోవాలి. డ‌బ్బులు లెక్క‌పెట్టుకోవాలి. ఇన్నీ చేసుకుంటే నాకు కిట్టుబాటు అయ్యేది 400 ఈ మాత్రానికి నేను ఇంత చాకిరీ చేయాలా?!-ఇదీ ప‌థ‌కం ప్రారంభించిన రెండు రోజుల త‌ర్వాత‌.. డ్రైవ‌ర్ల నుంచి వ్య‌క్త‌మైన అబిప్రాయం. దీంతో వెయ్యికి పైగా వాహ‌నాల‌ను డ్రైవ‌ర్లు.. ఆర్ ఐ(రీజిన‌ల్ ఇన్స్‌పెక్ట‌ర్‌)కు అప్ప‌గించేసిన‌ట్టు తెలిసింది. మ‌రి ఈ కీల‌క ప‌థ‌కం ఆదిలోనే ఇలా రెక్క‌లు విరిగిపోతే.. మున్ముందు ప‌రిస్థితి ఏంటి? ఏదేమైనా.. ఈ ప‌రిణామం.. జ‌గ‌న్‌కు షాకిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 5, 2021 3:41 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

1 hour ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

1 hour ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

2 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

3 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

3 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

5 hours ago