Political News

జ‌గ‌న్‌కు భారీ షాక్‌: విఫ‌ల‌మైన కీల‌క ప‌థ‌కం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కీల‌క ప‌థ‌కాల‌ను ఆయ‌న అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప‌థ‌కం.. ఇంటింటికీ రేష‌న్ పంపిణీ. వైసీపీ నేత‌లు, సీఎం జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే.. ఈ ప‌థ‌కం దేశంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా అమ‌లు చేయ‌లేదు. నిజ‌మే! ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటింటికీ.. రేష‌న్‌ను పంపిణీ చేయ‌లేదు. బ‌హుశ ఇది సాధ్యం కాద‌ని.. ఆయా రాష్ట్రాలు ఎప్పుడో గుర్తించి ఉంటాయి. కానీ, ఏపీలో మాత్రం జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

సుమారు 9270 వాహ‌నాల‌ను కొనుగోలు చేసి.. యువ‌త‌కు అప్ప‌గించారు. నెల‌కు 1800 మంది ల‌బ్ధి దారుల‌కు 1వ తారీకు నుంచి 15వ తారీకులోపు రేష‌న్ స‌రుకుల‌ను ఇంటి ముందుకే తీసుకువెళ్లాల‌ని నిర్దేశించారు. ఇది పైకి చెప్ప‌డానికి, ప్ర‌చారం చేసుకునేందుకు చాలా బాగానే ఉంది. ముఖ్యంగా ఈప‌థ‌కం నుంచి జ‌గ‌న్ చాలా నే ఆశించారు. ఓటు బ్యాంకు విష‌యంలో సానుభూతి త‌న‌కు పెరుగుతుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే అప్పు చేసి మ‌రీ వాహ‌నాలు కొన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 1 నుంచే ప్రారంభించాల‌ని అనుకున్నారు. అయితే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహ‌నాల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ బ్రేకులు వేశారు.

ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో రెండు రోజ‌లు కింద‌ట ఈ కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు మంత్రి కొడాలి నాని. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రిగా ఈయ‌నకు కూడా ఈ ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేసుకోవ‌డం అత్యంత కీల‌కం. అయితే.. క్షేత్ర‌స్థాయిలో రెండు రోజుల్లోనే ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. కీల‌క‌మైన‌.. ఐదు విధుల‌ను ఒక్క‌రే చేసేందుకు డ్రైవ‌ర్లు అంగీక‌రించ‌డం లేదు. నేను ఒక్క‌డినే అన్నీ చూసుకోవాలి. డ్రైవింగ్ నేనే చేసుకోవాలి. బియ్యం బ‌స్తాల‌ను స్టాక్ పాయింట్ నుంచి నేనే మోసి.. బండిలో వేసుకోవాలి. వాటిని ఇంటింటికీ చేర్చాలి. రెండో అంత‌స్థులోనో మూడో అంత‌స్థులోనో(ఇందిర‌మ్మ గృహాలు) ల‌బ్ధి దారులు ఉంటే.. అక్క‌డ కి చేర్చాలి. ఇక‌, ఈ పోస్ మిష‌న్ ఆప‌రేట్ చేసుకోవాలి. డ‌బ్బులు లెక్క‌పెట్టుకోవాలి. ఇన్నీ చేసుకుంటే నాకు కిట్టుబాటు అయ్యేది 400 ఈ మాత్రానికి నేను ఇంత చాకిరీ చేయాలా?!-ఇదీ ప‌థ‌కం ప్రారంభించిన రెండు రోజుల త‌ర్వాత‌.. డ్రైవ‌ర్ల నుంచి వ్య‌క్త‌మైన అబిప్రాయం. దీంతో వెయ్యికి పైగా వాహ‌నాల‌ను డ్రైవ‌ర్లు.. ఆర్ ఐ(రీజిన‌ల్ ఇన్స్‌పెక్ట‌ర్‌)కు అప్ప‌గించేసిన‌ట్టు తెలిసింది. మ‌రి ఈ కీల‌క ప‌థ‌కం ఆదిలోనే ఇలా రెక్క‌లు విరిగిపోతే.. మున్ముందు ప‌రిస్థితి ఏంటి? ఏదేమైనా.. ఈ ప‌రిణామం.. జ‌గ‌న్‌కు షాకిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 5, 2021 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

48 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago