Political News

జ‌గ‌న్‌కు భారీ షాక్‌: విఫ‌ల‌మైన కీల‌క ప‌థ‌కం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కీల‌క ప‌థ‌కాల‌ను ఆయ‌న అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప‌థ‌కం.. ఇంటింటికీ రేష‌న్ పంపిణీ. వైసీపీ నేత‌లు, సీఎం జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే.. ఈ ప‌థ‌కం దేశంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా అమ‌లు చేయ‌లేదు. నిజ‌మే! ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటింటికీ.. రేష‌న్‌ను పంపిణీ చేయ‌లేదు. బ‌హుశ ఇది సాధ్యం కాద‌ని.. ఆయా రాష్ట్రాలు ఎప్పుడో గుర్తించి ఉంటాయి. కానీ, ఏపీలో మాత్రం జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

సుమారు 9270 వాహ‌నాల‌ను కొనుగోలు చేసి.. యువ‌త‌కు అప్ప‌గించారు. నెల‌కు 1800 మంది ల‌బ్ధి దారుల‌కు 1వ తారీకు నుంచి 15వ తారీకులోపు రేష‌న్ స‌రుకుల‌ను ఇంటి ముందుకే తీసుకువెళ్లాల‌ని నిర్దేశించారు. ఇది పైకి చెప్ప‌డానికి, ప్ర‌చారం చేసుకునేందుకు చాలా బాగానే ఉంది. ముఖ్యంగా ఈప‌థ‌కం నుంచి జ‌గ‌న్ చాలా నే ఆశించారు. ఓటు బ్యాంకు విష‌యంలో సానుభూతి త‌న‌కు పెరుగుతుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే అప్పు చేసి మ‌రీ వాహ‌నాలు కొన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 1 నుంచే ప్రారంభించాల‌ని అనుకున్నారు. అయితే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహ‌నాల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ బ్రేకులు వేశారు.

ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో రెండు రోజ‌లు కింద‌ట ఈ కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు మంత్రి కొడాలి నాని. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రిగా ఈయ‌నకు కూడా ఈ ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేసుకోవ‌డం అత్యంత కీల‌కం. అయితే.. క్షేత్ర‌స్థాయిలో రెండు రోజుల్లోనే ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. కీల‌క‌మైన‌.. ఐదు విధుల‌ను ఒక్క‌రే చేసేందుకు డ్రైవ‌ర్లు అంగీక‌రించ‌డం లేదు. నేను ఒక్క‌డినే అన్నీ చూసుకోవాలి. డ్రైవింగ్ నేనే చేసుకోవాలి. బియ్యం బ‌స్తాల‌ను స్టాక్ పాయింట్ నుంచి నేనే మోసి.. బండిలో వేసుకోవాలి. వాటిని ఇంటింటికీ చేర్చాలి. రెండో అంత‌స్థులోనో మూడో అంత‌స్థులోనో(ఇందిర‌మ్మ గృహాలు) ల‌బ్ధి దారులు ఉంటే.. అక్క‌డ కి చేర్చాలి. ఇక‌, ఈ పోస్ మిష‌న్ ఆప‌రేట్ చేసుకోవాలి. డ‌బ్బులు లెక్క‌పెట్టుకోవాలి. ఇన్నీ చేసుకుంటే నాకు కిట్టుబాటు అయ్యేది 400 ఈ మాత్రానికి నేను ఇంత చాకిరీ చేయాలా?!-ఇదీ ప‌థ‌కం ప్రారంభించిన రెండు రోజుల త‌ర్వాత‌.. డ్రైవ‌ర్ల నుంచి వ్య‌క్త‌మైన అబిప్రాయం. దీంతో వెయ్యికి పైగా వాహ‌నాల‌ను డ్రైవ‌ర్లు.. ఆర్ ఐ(రీజిన‌ల్ ఇన్స్‌పెక్ట‌ర్‌)కు అప్ప‌గించేసిన‌ట్టు తెలిసింది. మ‌రి ఈ కీల‌క ప‌థ‌కం ఆదిలోనే ఇలా రెక్క‌లు విరిగిపోతే.. మున్ముందు ప‌రిస్థితి ఏంటి? ఏదేమైనా.. ఈ ప‌రిణామం.. జ‌గ‌న్‌కు షాకిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 5, 2021 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

42 minutes ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

2 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

2 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

4 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

5 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

5 hours ago