Political News

వీర్రాజు సరికొత్త నినాదం..వర్కవుటవుతుందా ?

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజకీయంగా సరికొత్త నినాదాన్ని అందుకున్నారా ? తాజాగా ఆయన మాటలు వింటే ఇదే అనుమానం పెరుగిపోతోంది. జనాభా అత్యధికంగా ఉన్న బీసీలకే రాజ్యాధికారం అంటు వీర్రాజు చేసిన ప్రకటనే విచిత్రంగా ఉంది. ఎందుకంటే కాపు నేత అయిన వీర్రాజు బీసీలకే ముఖ్యమంత్రి పదవి అనే నినాదాన్ని ఎత్తుకోవటంటే అనుమానం రావటంలో వింతేముంది. కాకపోతే బీసీ నేతనే బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తుందని వీర్రాజు చేసిన ప్రకటన వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందన్న విషయం తెలిసిపోతోంది.

సమాజంలో అత్యధిక జనాభా కలిగిన సామాజికవర్గాలు రెండే రెండు. అందులో మొదటిది బీసీలు రెండోది కాపులు. అయితే చాలా జిల్లాల్లో బీసీలకు కాపులకు రాజకీయాల్లో ఏమాత్రం పడదు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో బీసీలకు కాపులకు మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. వీర్రాజు కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతే. మరి ఈ విషయం తెలిసీ తాను స్వయంగా కాపు సామాజికవర్గం అయ్యుండి కూడా బీసీలకే ముఖ్యమంత్రి పదవని ఎందుకు మొదలుపెట్టినట్లు ?

ఎందుకంటే బీజేపీ వైపు బీసీలను లాక్కోవటానికే తప్ప మరోటికాదు. మొదటినుండి బీసీల్లో అత్యధికులు టీడీపీ వైపున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీసీల్లో చీలికవచ్చి వైసీపీవైపు మొగ్గుచూపించారు. అంటే బీసీల్లో అత్యధికులు ఉంటే వైసీపీ వైపు లేకపోతే టీడీపీ వైపున్నారని తేలిపోతోంది. అందుకనే బలమైన సామాజికవర్గమైన బీసీల మద్దతు లేకుండా బీజేపీకి నాలుగు సీట్లు కూడా రాదని వీర్రాజుకు తెలుసు. అందుకనే బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రిగా బీసీనే ప్రకటిస్తుందని చెప్పింది.

బీజేపీ తరపున బీసీ నేతే ముఖ్యమంత్రి అవుతారని చెప్పటం వరకు ఓకేనే కానీ టీడీపీ, వైసీపీలు కూడా బీసీలనే సీఎంలను చేస్తుందని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది. ప్రాంతీయ పార్టీలన్నవి ప్రైవేటు లిమిటెడ్ లాంటివి. వాటికి అధినేతలుగా ఎవరుంటే వాళ్ళే ముఖ్యమంత్రులవుతారని వీర్రాజుకు అంతమాత్రం తెలీదా ? తెలిసీ చాలెంజ్ చేస్తున్నారంటే బీసీలను పై రెండు పార్టీలకు వ్యతిరేకం చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎలాగూ బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టే వీర్రాజు నోటికొచ్చిన ప్రకటన చేశారనే ఆరోపణ కూడా మొదలైపోయింది. మహాఅయితే రాబోయే ఎన్నికలనాటికి బీజేపీ తరపున ఎక్కడైనా గట్టి నేతలు పోటీ చేస్తే అదే భాగ్యమన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కమలంపార్టీ తరపున పోటీ చేసిన అత్యధికులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్న విషయం గ్రహించాలి. చూద్దాం వీర్రాజు కొత్త రాజకీయ నినాదం ఏ మేరకు వర్కవుటవుతుందో.

This post was last modified on February 5, 2021 12:37 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

1 hour ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

2 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

3 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

4 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

4 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

5 hours ago