పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ కు బ్రేకులు పడ్డాయి. ఏ యాప్ విడుదల చేయాలన్నా, గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి తేవాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలి. ఇటువంటి ప్రమాణాల్లో సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ అన్నది చాలా ప్రధానమైనది.
అయితే ఎటువంటి ప్రమాణాలు పాటించకుండానే, సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ లేకుండానే నిమ్మగడ్డ యాప్ ను విడుదల చేసేశారు. మొదటి నుండి యాప్ వాడకంపై రాష్ట్రప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కమీషనర్ లెక్కచేయలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తన నిర్ణయాలపై ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పేందుకు లేదంటూ ఒంటెత్తు పోకడలు పోతున్నారు. అందుకే యాప్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది.
సరే ఈ విషయాలు ఎలాగున్నా యాప్ ను నిమ్మగడ్డ బుధవారం విడుదల చేశారు. గురువారం నుండి జనాలకు గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. అయితే యాప్ ను తాను విడుదల చేసినా సాంకేతిక లోపాల కారణంగా గుగుల్ ప్లే స్టోర్ లో పనిచేయటం లేదట. కారణం ఏమిటా అని చూస్తే యాప్ కు సెక్యురిటి ఆడిట్ సర్టిఫికేట్ లేకపోవటమే అని తేలింది.
ఇపుడు సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ కోసమని యాప్ ను ఏపి టెక్నాలజీ సర్వీసెస్ కు నిమ్మగడ్డ పంపారు. ఈ యాప్ తయారీలో తీసుకున్న ప్రమాణాలు, వాడకంలో తలెత్తే సమస్యలు, వాటిని అధిమించే అవకాశాలు లాంటి వాటిని ఏపి టెక్నాలజీ సర్వీసెస్ పరిశీలించి అప్పుడు ఆడిట్ సెక్యురిటి సర్టిఫికేట్ జారీచేస్తుంది. అప్పుడు గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇదంతా జరగటానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. మరి పంచాయితి ఎన్నికల్లోగా ఈ వాచ్ యాప్ అందుబాటులోకి వస్తుందో లేదో.
This post was last modified on February 5, 2021 11:25 am
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…