పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ కు బ్రేకులు పడ్డాయి. ఏ యాప్ విడుదల చేయాలన్నా, గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి తేవాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలి. ఇటువంటి ప్రమాణాల్లో సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ అన్నది చాలా ప్రధానమైనది.
అయితే ఎటువంటి ప్రమాణాలు పాటించకుండానే, సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ లేకుండానే నిమ్మగడ్డ యాప్ ను విడుదల చేసేశారు. మొదటి నుండి యాప్ వాడకంపై రాష్ట్రప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కమీషనర్ లెక్కచేయలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తన నిర్ణయాలపై ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పేందుకు లేదంటూ ఒంటెత్తు పోకడలు పోతున్నారు. అందుకే యాప్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది.
సరే ఈ విషయాలు ఎలాగున్నా యాప్ ను నిమ్మగడ్డ బుధవారం విడుదల చేశారు. గురువారం నుండి జనాలకు గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. అయితే యాప్ ను తాను విడుదల చేసినా సాంకేతిక లోపాల కారణంగా గుగుల్ ప్లే స్టోర్ లో పనిచేయటం లేదట. కారణం ఏమిటా అని చూస్తే యాప్ కు సెక్యురిటి ఆడిట్ సర్టిఫికేట్ లేకపోవటమే అని తేలింది.
ఇపుడు సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ కోసమని యాప్ ను ఏపి టెక్నాలజీ సర్వీసెస్ కు నిమ్మగడ్డ పంపారు. ఈ యాప్ తయారీలో తీసుకున్న ప్రమాణాలు, వాడకంలో తలెత్తే సమస్యలు, వాటిని అధిమించే అవకాశాలు లాంటి వాటిని ఏపి టెక్నాలజీ సర్వీసెస్ పరిశీలించి అప్పుడు ఆడిట్ సెక్యురిటి సర్టిఫికేట్ జారీచేస్తుంది. అప్పుడు గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇదంతా జరగటానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. మరి పంచాయితి ఎన్నికల్లోగా ఈ వాచ్ యాప్ అందుబాటులోకి వస్తుందో లేదో.
This post was last modified on February 5, 2021 11:25 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…