Political News

నిమ్మగడ్డ తెచ్చిన ‘ఈ వాచ్’ కు బ్రేకులు

పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ కు బ్రేకులు పడ్డాయి. ఏ యాప్ విడుదల చేయాలన్నా, గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి తేవాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలి. ఇటువంటి ప్రమాణాల్లో సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ అన్నది చాలా ప్రధానమైనది.

అయితే ఎటువంటి ప్రమాణాలు పాటించకుండానే, సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ లేకుండానే నిమ్మగడ్డ యాప్ ను విడుదల చేసేశారు. మొదటి నుండి యాప్ వాడకంపై రాష్ట్రప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కమీషనర్ లెక్కచేయలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తన నిర్ణయాలపై ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పేందుకు లేదంటూ ఒంటెత్తు పోకడలు పోతున్నారు. అందుకే యాప్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది.

సరే ఈ విషయాలు ఎలాగున్నా యాప్ ను నిమ్మగడ్డ బుధవారం విడుదల చేశారు. గురువారం నుండి జనాలకు గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. అయితే యాప్ ను తాను విడుదల చేసినా సాంకేతిక లోపాల కారణంగా గుగుల్ ప్లే స్టోర్ లో పనిచేయటం లేదట. కారణం ఏమిటా అని చూస్తే యాప్ కు సెక్యురిటి ఆడిట్ సర్టిఫికేట్ లేకపోవటమే అని తేలింది.

ఇపుడు సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ కోసమని యాప్ ను ఏపి టెక్నాలజీ సర్వీసెస్ కు నిమ్మగడ్డ పంపారు. ఈ యాప్ తయారీలో తీసుకున్న ప్రమాణాలు, వాడకంలో తలెత్తే సమస్యలు, వాటిని అధిమించే అవకాశాలు లాంటి వాటిని ఏపి టెక్నాలజీ సర్వీసెస్ పరిశీలించి అప్పుడు ఆడిట్ సెక్యురిటి సర్టిఫికేట్ జారీచేస్తుంది. అప్పుడు గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇదంతా జరగటానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. మరి పంచాయితి ఎన్నికల్లోగా ఈ వాచ్ యాప్ అందుబాటులోకి వస్తుందో లేదో.

This post was last modified on February 5, 2021 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

5 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

28 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

48 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago