పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ కు బ్రేకులు పడ్డాయి. ఏ యాప్ విడుదల చేయాలన్నా, గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి తేవాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలి. ఇటువంటి ప్రమాణాల్లో సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ అన్నది చాలా ప్రధానమైనది.
అయితే ఎటువంటి ప్రమాణాలు పాటించకుండానే, సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ లేకుండానే నిమ్మగడ్డ యాప్ ను విడుదల చేసేశారు. మొదటి నుండి యాప్ వాడకంపై రాష్ట్రప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కమీషనర్ లెక్కచేయలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తన నిర్ణయాలపై ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పేందుకు లేదంటూ ఒంటెత్తు పోకడలు పోతున్నారు. అందుకే యాప్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది.
సరే ఈ విషయాలు ఎలాగున్నా యాప్ ను నిమ్మగడ్డ బుధవారం విడుదల చేశారు. గురువారం నుండి జనాలకు గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. అయితే యాప్ ను తాను విడుదల చేసినా సాంకేతిక లోపాల కారణంగా గుగుల్ ప్లే స్టోర్ లో పనిచేయటం లేదట. కారణం ఏమిటా అని చూస్తే యాప్ కు సెక్యురిటి ఆడిట్ సర్టిఫికేట్ లేకపోవటమే అని తేలింది.
ఇపుడు సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ కోసమని యాప్ ను ఏపి టెక్నాలజీ సర్వీసెస్ కు నిమ్మగడ్డ పంపారు. ఈ యాప్ తయారీలో తీసుకున్న ప్రమాణాలు, వాడకంలో తలెత్తే సమస్యలు, వాటిని అధిమించే అవకాశాలు లాంటి వాటిని ఏపి టెక్నాలజీ సర్వీసెస్ పరిశీలించి అప్పుడు ఆడిట్ సెక్యురిటి సర్టిఫికేట్ జారీచేస్తుంది. అప్పుడు గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇదంతా జరగటానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. మరి పంచాయితి ఎన్నికల్లోగా ఈ వాచ్ యాప్ అందుబాటులోకి వస్తుందో లేదో.
This post was last modified on February 5, 2021 11:25 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…