తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను చెప్పే మాటలకు ఏ మాత్రం సాక్ష్యాలు.. ఆధారాలు చూపించనప్పటికి.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని ఆధారాలుగా చూపిస్తున్నారు. ఇంతకూ రేవంత్ తాజా ఆరోపణ ఏమంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్ చార్జిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని నియమించటం వెనుక అసలు విషయం వేరే ఉందన్న రేవంత్.. కొత్త సంచలనానికి తెర తీశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచి నిధులు సమకూరుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మాట్లాడిన రేవంత్.. తమిళనాడు ఎన్నికల్లో టీఆర్ఎస్ సహకారం పూర్తిస్థాయిలో ఉండేందుకు కిషన్ రెడ్డిని నియమించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకరిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అందుకే.. తెలంగాణ ఇంటెలిజెన్స్ ను తమిళనాడుకు పంపి బీజేపీకి కేసీఆర్ సహకారాన్ని అందిస్తున్నారంటూ విమర్శించారు.
This post was last modified on February 4, 2021 12:43 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…