Political News

తమిళనాడు ఎన్నికల్లో కేసీఆర్.. ఫైర్ బ్రాండ్ షాకింగ్ వ్యాఖ్యలు


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను చెప్పే మాటలకు ఏ మాత్రం సాక్ష్యాలు.. ఆధారాలు చూపించనప్పటికి.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని ఆధారాలుగా చూపిస్తున్నారు. ఇంతకూ రేవంత్ తాజా ఆరోపణ ఏమంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్ చార్జిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని నియమించటం వెనుక అసలు విషయం వేరే ఉందన్న రేవంత్.. కొత్త సంచలనానికి తెర తీశారు.


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచి నిధులు సమకూరుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మాట్లాడిన రేవంత్.. తమిళనాడు ఎన్నికల్లో టీఆర్ఎస్ సహకారం పూర్తిస్థాయిలో ఉండేందుకు కిషన్ రెడ్డిని నియమించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకరిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అందుకే.. తెలంగాణ ఇంటెలిజెన్స్ ను తమిళనాడుకు పంపి బీజేపీకి కేసీఆర్ సహకారాన్ని అందిస్తున్నారంటూ విమర్శించారు.

This post was last modified on February 4, 2021 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

1 hour ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

1 hour ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

2 hours ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

4 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

4 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

5 hours ago