తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను చెప్పే మాటలకు ఏ మాత్రం సాక్ష్యాలు.. ఆధారాలు చూపించనప్పటికి.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని ఆధారాలుగా చూపిస్తున్నారు. ఇంతకూ రేవంత్ తాజా ఆరోపణ ఏమంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్ చార్జిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని నియమించటం వెనుక అసలు విషయం వేరే ఉందన్న రేవంత్.. కొత్త సంచలనానికి తెర తీశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచి నిధులు సమకూరుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మాట్లాడిన రేవంత్.. తమిళనాడు ఎన్నికల్లో టీఆర్ఎస్ సహకారం పూర్తిస్థాయిలో ఉండేందుకు కిషన్ రెడ్డిని నియమించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకరిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అందుకే.. తెలంగాణ ఇంటెలిజెన్స్ ను తమిళనాడుకు పంపి బీజేపీకి కేసీఆర్ సహకారాన్ని అందిస్తున్నారంటూ విమర్శించారు.
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…