Political News

ప్రైవేటుపరం కానున్న విశాఖ స్టీలు

ఎప్పటి నుండో అనుకుంటున్న పద్దతిలోనే విశాఖపట్నంలోని స్టీలు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయటానికి పావులు చురుగ్గా కదులుతోంది. స్టీలు ఫ్యాక్టరీలోని తన వాటాలో కొంత ఉపసంహరించుకోవటానికి కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసుకోవటం గమనార్హం. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. బడ్జెట్ తర్వాత వాటా ఉపసంహరణకు కేంద్రం ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలుపెట్టేసిందట. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్న ఏకైక కారణంతోనే ప్రైవేటుపరం చేయాలని కేంద్రం డిసైడ్ చేయటం విచిత్రంగా ఉంది.

స్టీలు ఫ్యాక్టరీ చాలా కాలంగా నష్టాల్లో ఉందన్నది వాస్తవం. అయితే ఎందుకు నష్టాల్లోకి వెళ్ళిపోయిందంటే ఫ్యాక్టరీకంటు సొంత ఐరన్ మైన్స్ లేకపోవటం వల్లే. సొంత గనులు లేని కారణంగా ముడి ఇనుము కోసం ఫ్యాక్టరీ ఇతర సంస్ధలపైన ఆధారపడాల్సొచ్చింది. దీనివల్ల ముడిసరుకును ఎక్కువ ధరపెట్టి కొనాల్సొస్తోంది. దీంతో ముడిసరుకు కొనుగోలుకు ఉత్పత్తి తర్వాత స్టీలు అమ్మకానికి మధ్య ధరల్లో బాగా తేడా వచ్చేసింది.

అంటే స్టీలు అమ్మే ధరకన్నా ముడిసరుకు కొనుగోలు ధరలు విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల సంవత్సరాలుగా ఫ్యాక్టరీ నష్టాల్లో కూరుకుపోతోంది, తనకు సొంతంగా ముడిసరుకు కోసం ఐరన్ గనులు కావాలంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం దశాబ్దాలుగా మొత్తుకుంటున్నా కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు. సొంత గనులు కావాలన్న విజ్ఞప్తిని పట్టించుకోని ఫ్యాక్టరీ నష్టాలకు సొంతగనులు లేకపోవటమే అని ఇపుడు స్ధాయిసంఘం చెప్పటం కేంద్రప్రభుత్వం అంగీకరించటం ఆశ్చర్యంగా ఉంది.

దశాబ్దాల పాటు నష్టాలు పేరుకుపోవటంతోనే తాజా సంస్ధ రూ. 1747 కోట్ల వోవరాల్ నష్టాల్లో కూరుకుపోయింది. నిజానికి ఇది భర్తీ చేసుకోలేనంత పెద్ద నష్టమేమీ కాదనే చెప్పాలి. ఇఫ్పటికైనా సంస్ధకు సొంత ఐరన్ గనులను కేంద్రం కేటాయిస్తే మెల్లిగా నష్టాలను పూడ్చుకుని లాభాల బాట పడుతుందనటంలో సందేహం లేదు. అయితే కేంద్రం ఆదిశగా ఆలోచించకుండా ఫ్యాక్టరీ నుండి తన వాటాను ఉపసంహరించుకుని ప్రైవేటు సంస్ధలకు అమ్మేయాలని డిసైడ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి కేంద్రమే వైజాగ్ స్టీలు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేసి ప్రైవేటుపరం చేయటానికి రెడీ అయిపోతోందని అర్ధమైపోతోంది.

This post was last modified on February 4, 2021 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

47 minutes ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

1 hour ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

2 hours ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

4 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

4 hours ago