టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సొంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిమ్మాడలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య గత నాలుగు రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పంచాయతీని టీడీపీ ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్ని స్తోంది. ఈ క్రమంలో అచ్చెన్న సతీమణినే నేరుగా ఇక్కడ సర్పంచ్ పదవికి పోటీ పెట్టారు. వాస్తవానికి వైసీపీ తరఫున ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. కానీ, వైసీపీ టెక్కలి ఇంచార్జ్.. దువ్వాడ శ్రీను వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడైన దూరపు బంధువు కింజరాపు అప్పన్నను సర్పంచ్ పదవికి రంగంలో కి దింపారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వివాదం చెలరేగింది. అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీను ఎంట్రీ అయి.. అప్పన్నతో నామినేషన్ వేయించారు. ఇక, ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్దంతో పాటు ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు.. తన బంధువే అయిన అప్పన్నకు ఫోన్ చేసి.. నామినేషన్ ఉపసంహరిం చుకోవాలని.. ఒకింత బెదిరింపు ధోరణితో హెచ్చరించిన ఆడియో ఒకటి వెలుగు చూసింది.
ఇప్పటికే నామినేషన్ వేసే క్రమంలో చోటు చేసుకున్న వివాదంపై అచ్చెన్న వర్గంపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఆడియో టేపు ఆధారంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేశారనే నేరంపై ఆయనను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అచ్చెన్న పోలీసుల తీరుపై మండి పడ్డారు. ‘‘డీఎస్పీ, సీఐలు నా బెడ్రూమ్ లోకి చొరబడ్డారు… ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి కలుగుతోంది. పోలీసులను చూసి ఉద్యోగులు కూడా సిగ్గు పడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా… రేపు అధికారం మాదే. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రిని. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు. తాట తీస్తా!!’’ అని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
This post was last modified on February 2, 2021 9:05 pm
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…