టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సొంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిమ్మాడలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య గత నాలుగు రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పంచాయతీని టీడీపీ ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్ని స్తోంది. ఈ క్రమంలో అచ్చెన్న సతీమణినే నేరుగా ఇక్కడ సర్పంచ్ పదవికి పోటీ పెట్టారు. వాస్తవానికి వైసీపీ తరఫున ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. కానీ, వైసీపీ టెక్కలి ఇంచార్జ్.. దువ్వాడ శ్రీను వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడైన దూరపు బంధువు కింజరాపు అప్పన్నను సర్పంచ్ పదవికి రంగంలో కి దింపారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వివాదం చెలరేగింది. అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీను ఎంట్రీ అయి.. అప్పన్నతో నామినేషన్ వేయించారు. ఇక, ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్దంతో పాటు ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు.. తన బంధువే అయిన అప్పన్నకు ఫోన్ చేసి.. నామినేషన్ ఉపసంహరిం చుకోవాలని.. ఒకింత బెదిరింపు ధోరణితో హెచ్చరించిన ఆడియో ఒకటి వెలుగు చూసింది.
ఇప్పటికే నామినేషన్ వేసే క్రమంలో చోటు చేసుకున్న వివాదంపై అచ్చెన్న వర్గంపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఆడియో టేపు ఆధారంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేశారనే నేరంపై ఆయనను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అచ్చెన్న పోలీసుల తీరుపై మండి పడ్డారు. ‘‘డీఎస్పీ, సీఐలు నా బెడ్రూమ్ లోకి చొరబడ్డారు… ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి కలుగుతోంది. పోలీసులను చూసి ఉద్యోగులు కూడా సిగ్గు పడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా… రేపు అధికారం మాదే. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రిని. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు. తాట తీస్తా!!’’ అని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
This post was last modified on February 2, 2021 9:05 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…