టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సొంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిమ్మాడలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య గత నాలుగు రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పంచాయతీని టీడీపీ ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్ని స్తోంది. ఈ క్రమంలో అచ్చెన్న సతీమణినే నేరుగా ఇక్కడ సర్పంచ్ పదవికి పోటీ పెట్టారు. వాస్తవానికి వైసీపీ తరఫున ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. కానీ, వైసీపీ టెక్కలి ఇంచార్జ్.. దువ్వాడ శ్రీను వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడైన దూరపు బంధువు కింజరాపు అప్పన్నను సర్పంచ్ పదవికి రంగంలో కి దింపారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వివాదం చెలరేగింది. అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీను ఎంట్రీ అయి.. అప్పన్నతో నామినేషన్ వేయించారు. ఇక, ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్దంతో పాటు ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు.. తన బంధువే అయిన అప్పన్నకు ఫోన్ చేసి.. నామినేషన్ ఉపసంహరిం చుకోవాలని.. ఒకింత బెదిరింపు ధోరణితో హెచ్చరించిన ఆడియో ఒకటి వెలుగు చూసింది.
ఇప్పటికే నామినేషన్ వేసే క్రమంలో చోటు చేసుకున్న వివాదంపై అచ్చెన్న వర్గంపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఆడియో టేపు ఆధారంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేశారనే నేరంపై ఆయనను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అచ్చెన్న పోలీసుల తీరుపై మండి పడ్డారు. ‘‘డీఎస్పీ, సీఐలు నా బెడ్రూమ్ లోకి చొరబడ్డారు… ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి కలుగుతోంది. పోలీసులను చూసి ఉద్యోగులు కూడా సిగ్గు పడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా… రేపు అధికారం మాదే. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రిని. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు. తాట తీస్తా!!’’ అని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…