మన తెలుగు నాయకుడు, కేంద్రంలో ఒకప్పుడు చక్రంతిప్పి.. నేడు .. రాజ్యాంగ పరిధిలోని అత్యున్నత స్థాయి అయిన ఉపరాష్ట్రపతి పొజిషన్లో ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు.. ఎక్కడ ఉన్నా.. తనదైన స్టయిల్లో దూసుకుపోతుంటారు. తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు తో ఆయన ఢిల్లీలో చక్రం తిప్పిన రోజుల నుంచి నేడు రాజ్యసభ చైర్మన్గా.. ఉపరాష్ట్రపతిగా కూడా తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు.. దేశం యావత్తును సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి.
ఇటీవల పార్లమెంటు నివేదిక వెల్లడైంది. దీనిలో రాజ్యసభలో ప్రాంతీయభాషలకు పట్టకట్టిన చైర్మన్గా వెంకయ్య నిలిచారు. ముఖ్యంగా ఎవరూ ఎప్పుడూ ప్రవేశ పెట్టని.. సంతాలీ(గిరిజన భాష) భాషను సైతం రాజ్యసభల అనుమతించారు. అదేసమయంలో ప్రాంతీయ భాషలను ప్రొత్సహించేందుకు ఆయన సెమినార్లు సైతం కండక్ట్ చేస్తున్నారు. దీంతో పార్లమెంటులో మాట్లాడాలంటే.. హిందీనో.. ఇంగ్లీషో వచ్చి ఉండాలని అనుకునే రోజుల నుంచి ఎవరైనా ఏ భాషలోనైనా మాట్లాడొచ్చనే దాకా పార్లమెంటు స్థాయిని పెంచి.. ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు వెంకయ్య.. రాజ్యసభలో మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్స్ వంటివాటిని ఎవరూ వాడరాదంటూ సభ్యులను గట్టిగానే ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా.. సభా కార్యకలాపాలను కూడా వీడియోలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతమైన రాజ్యసభ చాంబర్లో కూర్చుని కూడా సభ్యులు ఇలా వీడియోలు తీయడం పార్లమెంటు నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అందువల్ల ఇక నుంచి ఎవరూ కూడా చాంబర్లలో కానీ, సభా ప్రాంగణంలో కానీ మొబైల్స్ వాడడానికి వీల్లేదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇలా సభ్యులు మొబైల్ ఫోన్లు వాడరాదనే ఆదేశాలు స్వతంత్ర భారత దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషమని అంటున్నారు మేధావులు.
This post was last modified on February 3, 2021 3:50 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…