తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అచ్చెన్నను మంగళవారం అరెస్టు చేశారు. వైసీపీ తరపున పోటీ చేయాలని అనుకున్న కింజరాపు అప్పలనాయుడును అచ్చెన్న బెదిరించారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు సోమవారం కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం అరెస్టు చేశారు.
టెక్కలి నియోజకవర్గంలో నిమ్మాడ గ్రామం కింజరాపు స్వగ్రామం. దశాబ్దాలుగా ఈ గ్రామంలో కింజరాపు కుటుంబం చెప్పిందే వేదంలాగ సాగుతోంది. అలాంటిది కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా అచ్చెన్న సోదరుడి కొడుకు అప్పలనాయుడు వైసీపీలో చేరారు. పంచాయితి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అచ్చెన్న ఫోనులో అప్పలనాయడుతో మాట్లాడారు. తర్వాత బెదిరించారు.
ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా అప్పలనాయుడు లొంగకపోయేసరికి నామినేషన్ దాఖలు చేసే కార్యాలయం దగ్గర బాగా గొడవ చేశారు. నామినేషన్ పత్రాలను లాగేసుకోవాలని, అభ్యర్ధిని దూరంగా తీసుకెళిపోవాలని టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే అక్కడ వైసీపీ నేతలు కూడా ఉండటంతో టీడీపీ నేతల ప్రయత్నాలు సాగలేదు. మొత్తానికి ఒకవైపు గొడవలు జరుగుతుండగానే మరోవైపు అప్పలనాయుడు నామినేషన్ వేశారు.
ఫోన్లో తనను బెదిరించటం, నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని అప్పలనాయుడు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుబాటులో ఉన్న వీడియో, ఆడియో సాక్ష్యాలను కూడా అభ్యర్ధి పోలీసులకు అందించారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అచ్చెన్నను అరెస్టు చేశారు.
This post was last modified on February 2, 2021 9:06 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…