దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైతుసంఘాల ఉద్యమానికి ఎంత మద్దతు వస్తోందో అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోయిన సంవత్సరం ఆగష్టులో మొదలైన ఆందోళన ఇటు పంజాబు అటు హర్యానాకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే ఆందోళన ఢిల్లీ బాట పట్టిందో అప్పటి నుండి ఉద్యమంగా రూపుదాల్చింది.
రైతుల ఆందోళనను ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో కేంద్రప్రభుత్వం ఆపేసింది. దాంతో అప్పటివరకు జరుగుతున్న ఆందోళన కాస్త ఉద్యమంగా మారిపోయింది. ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రైతాంగం నుండి ఊహించని మద్దతు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం రైతుసంఘాల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న ఐటిసెల్ అనే చెప్పాలి. రైతుసంఘాల ఉద్యమానికి జాతీయ మీడియా పెద్దగా కవరేజి ఇవ్వటం లేదని రైతుసంఘాల నేతలకు అర్ధమైపోయిందట.
ఉద్యమానికి ప్రచారం ఇవ్వకపోగా రివర్సులో ఉద్యమాన్ని నీరుగార్చేట్లుగా ఉందట జాతీయ మీడియా వ్యవహారం. దాంతో అప్పటికప్పుడు రైతులు, రైతుకుటుంబాల్లోని యువ విద్యావంతుల ఆధ్వర్యంలో ఐటిసెల్ ఏర్పాటు చేసుకున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాను అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నారు. దాంతో మెయిన్ మీడియాపై ఆధారపడకుండా తమ వాదనను రైతుసంఘాలు సోషల్ మీడియా ద్వారా సొంతంగానే జనాల్లోకి పంపటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రైతుసంఘాల కార్యక్రమాల కోసం సోషల్ మీడియా ఏర్పాటయ్యిందో వెంటనే ఆదరణ కూడా మొదలైపోయింది.
ప్రస్తుతం ట్విట్టర్లో 1.44 లక్షలు, ఫేస్ బుక్ లో 2.86 లక్షలు, ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 2 లక్షలు, యూట్యూబ్ లో దాదాపు 12.5 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ప్రతిరోజు సుమారు 2.5 కోట్లమంది రైతుఉద్యమానికి సంబంధించిన విషయాలను జనాలు తెలుసుకుంటున్నారు. పంజాబు, హర్యానాలోని రైతుల కుటుంబాలకు చెందిన విదేశాల్లో ఉన్న వారే సోషల్ మీడియా సాంకేతిక పరిజ్ఞానంలో కీలకపాత్ర పోషిస్తున్నారట. కేంద్రప్రభుత్వంతో జరిగిన చర్చలను, రైతుసంఘాల నేతల వాదనలను ఎప్పటికప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళటంలో సోషల్ మీడియానే ప్రధానపాత్ర పోషిస్తోంది.
ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళటంలో రైతుసంఘాలు జాతీయ మీడియాపైన ఏమాత్రం ఆధారపడటం లేదు. రైతుసంఘాల ఐటి విభాగం ఇన్చార్జి బల్జీత్ సింగ్ మాట్లాడుతూ ఉద్యమప్రచారంపై జాతీయమీడియా పైన ఆధారపడితే లాభం లేదని అర్ధమైపోయిందన్నారు. తమ వాదనను తాము నేరుగా జనాలకు వినిపించేందుకే సొంతంగా సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. జాతీయ మీడియాలో మెజారిటి కేంద్రప్రభుత్వం గుప్పిట్లో ఇరుక్కుపోయినట్లు బల్జీత్ ఆరోపించారు. మొత్తానికి సొంతంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియాతో రైతుసంఘాలు జనాల్లోకి దూసుకుపోతున్నారు.
This post was last modified on February 1, 2021 5:00 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…