Political News

అల్లర్ల తర్వాత వందమంది రైతుల అదృశ్యం ?

మొన్నటి 26వ తేదీన ఢిల్లీలో రైతుసంఘాల ర్యాలీ తర్వాత సుమారు 100 మంది రైతుల ఆచూకీ తెలీటం లేదా ? ఎంతవెతికినా వాళ్ళ జాడ కనబడలేదా ? అంటే అవుననే అంటున్నారు రైతులు, మానవహక్కుల సంఘాలు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా వీధుల్లోను, ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు బీభత్సం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అల్లర్లకు కారకులంటూ పోలీసులు ఇఫ్పటికే కొన్ని వందల మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం లేకపోతే విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేయటం మామూలుగా జరిగేదే. కానీ అల్లర్లు జరిగిన రోజు నుండి కనీసం వందమంది రైతులు ఎక్కడా కనబడటం లేదట. ఢిల్లీలో ర్యాలీ జరిగిన తర్వాత అదే రోజు రాత్రం, మరుసటి రోజుకు అంతకుముందు ఉద్యమాలు జరుగుతున్న దీక్షా శిబిరాలకు రైతులంతా చేరుకునేశారు. కానీ వందమంది రైతుల జాడ మాత్రం ఎంత వెతికినా దొరకటం లేదని రైతుసంఘాల నేతలంటున్నారు.

దీక్షా శిబిరాలకు తిరిగి వచ్చిన రైతుల ద్వారా కొందరు రైతులు కనబడటం లేదని సమాచారం అందిందని మానవహక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కనబడకుండా పోయిన రైతల జాబితాను తీసుకుని గడచిన నాలుగు రోజులుగా తాము ఎంత వెతికినా ఎక్కడా ఆచూకీ కనబడలేదని హక్కుల సంఘం కార్యకర్తలు చెప్పటం సంచలనంగా మారింది. వీరిలో మోగా ప్రాంతంలోని తతారీవాల గ్రామానికి చెందిన 12 మంది రైతుల ఆచూకీ గడచిన ఐదు రోజులుగా కనబడటం లేదట.

కనిపంచకుండా పోయిన రైతుల కుటుంబాల నుండి తమకు సమాచారం అందుతోందని భారతీయ కిసాన్ యూనియర్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ చెప్పారు. మరొకసారి జాగ్రత్తగా వెతికించి అదృశ్యమైపోయిన 100 మంది రైతుల జాబితాను ప్రకటిస్తామన్నారు. 400 మంది రైతులు పోలీసుల అక్రమ కస్టడీలో ఉన్నట్లు సామాజిక హక్కుల కార్యకర్త సరాబ్జిత్ సింగ్ వెర్కా ఆరోపించారు. మొత్తం మీద ఢిల్లీ అల్లర్ల తర్వాత అరెస్టులు, నిర్భందాల్లో ఉన్న రైతులు కాకుండా వందమంది రైతులు కనిపించటం లేదన్న విషయం ఇపుడు సంచలనంగా మారింది. చూద్దాం వీళ్ళ ఆచూకీ ఎప్పుడు బయటపడుతుందో.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

4 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

7 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

10 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

10 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

10 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

10 hours ago