Political News

అల్లర్ల తర్వాత వందమంది రైతుల అదృశ్యం ?

మొన్నటి 26వ తేదీన ఢిల్లీలో రైతుసంఘాల ర్యాలీ తర్వాత సుమారు 100 మంది రైతుల ఆచూకీ తెలీటం లేదా ? ఎంతవెతికినా వాళ్ళ జాడ కనబడలేదా ? అంటే అవుననే అంటున్నారు రైతులు, మానవహక్కుల సంఘాలు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా వీధుల్లోను, ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు బీభత్సం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అల్లర్లకు కారకులంటూ పోలీసులు ఇఫ్పటికే కొన్ని వందల మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం లేకపోతే విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేయటం మామూలుగా జరిగేదే. కానీ అల్లర్లు జరిగిన రోజు నుండి కనీసం వందమంది రైతులు ఎక్కడా కనబడటం లేదట. ఢిల్లీలో ర్యాలీ జరిగిన తర్వాత అదే రోజు రాత్రం, మరుసటి రోజుకు అంతకుముందు ఉద్యమాలు జరుగుతున్న దీక్షా శిబిరాలకు రైతులంతా చేరుకునేశారు. కానీ వందమంది రైతుల జాడ మాత్రం ఎంత వెతికినా దొరకటం లేదని రైతుసంఘాల నేతలంటున్నారు.

దీక్షా శిబిరాలకు తిరిగి వచ్చిన రైతుల ద్వారా కొందరు రైతులు కనబడటం లేదని సమాచారం అందిందని మానవహక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కనబడకుండా పోయిన రైతల జాబితాను తీసుకుని గడచిన నాలుగు రోజులుగా తాము ఎంత వెతికినా ఎక్కడా ఆచూకీ కనబడలేదని హక్కుల సంఘం కార్యకర్తలు చెప్పటం సంచలనంగా మారింది. వీరిలో మోగా ప్రాంతంలోని తతారీవాల గ్రామానికి చెందిన 12 మంది రైతుల ఆచూకీ గడచిన ఐదు రోజులుగా కనబడటం లేదట.

కనిపంచకుండా పోయిన రైతుల కుటుంబాల నుండి తమకు సమాచారం అందుతోందని భారతీయ కిసాన్ యూనియర్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ చెప్పారు. మరొకసారి జాగ్రత్తగా వెతికించి అదృశ్యమైపోయిన 100 మంది రైతుల జాబితాను ప్రకటిస్తామన్నారు. 400 మంది రైతులు పోలీసుల అక్రమ కస్టడీలో ఉన్నట్లు సామాజిక హక్కుల కార్యకర్త సరాబ్జిత్ సింగ్ వెర్కా ఆరోపించారు. మొత్తం మీద ఢిల్లీ అల్లర్ల తర్వాత అరెస్టులు, నిర్భందాల్లో ఉన్న రైతులు కాకుండా వందమంది రైతులు కనిపించటం లేదన్న విషయం ఇపుడు సంచలనంగా మారింది. చూద్దాం వీళ్ళ ఆచూకీ ఎప్పుడు బయటపడుతుందో.

This post was last modified on January 31, 2021 1:38 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

2 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

2 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

3 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

3 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

4 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

4 hours ago