Political News

అల్లర్ల తర్వాత వందమంది రైతుల అదృశ్యం ?

మొన్నటి 26వ తేదీన ఢిల్లీలో రైతుసంఘాల ర్యాలీ తర్వాత సుమారు 100 మంది రైతుల ఆచూకీ తెలీటం లేదా ? ఎంతవెతికినా వాళ్ళ జాడ కనబడలేదా ? అంటే అవుననే అంటున్నారు రైతులు, మానవహక్కుల సంఘాలు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా వీధుల్లోను, ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు బీభత్సం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అల్లర్లకు కారకులంటూ పోలీసులు ఇఫ్పటికే కొన్ని వందల మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం లేకపోతే విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేయటం మామూలుగా జరిగేదే. కానీ అల్లర్లు జరిగిన రోజు నుండి కనీసం వందమంది రైతులు ఎక్కడా కనబడటం లేదట. ఢిల్లీలో ర్యాలీ జరిగిన తర్వాత అదే రోజు రాత్రం, మరుసటి రోజుకు అంతకుముందు ఉద్యమాలు జరుగుతున్న దీక్షా శిబిరాలకు రైతులంతా చేరుకునేశారు. కానీ వందమంది రైతుల జాడ మాత్రం ఎంత వెతికినా దొరకటం లేదని రైతుసంఘాల నేతలంటున్నారు.

దీక్షా శిబిరాలకు తిరిగి వచ్చిన రైతుల ద్వారా కొందరు రైతులు కనబడటం లేదని సమాచారం అందిందని మానవహక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కనబడకుండా పోయిన రైతల జాబితాను తీసుకుని గడచిన నాలుగు రోజులుగా తాము ఎంత వెతికినా ఎక్కడా ఆచూకీ కనబడలేదని హక్కుల సంఘం కార్యకర్తలు చెప్పటం సంచలనంగా మారింది. వీరిలో మోగా ప్రాంతంలోని తతారీవాల గ్రామానికి చెందిన 12 మంది రైతుల ఆచూకీ గడచిన ఐదు రోజులుగా కనబడటం లేదట.

కనిపంచకుండా పోయిన రైతుల కుటుంబాల నుండి తమకు సమాచారం అందుతోందని భారతీయ కిసాన్ యూనియర్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ చెప్పారు. మరొకసారి జాగ్రత్తగా వెతికించి అదృశ్యమైపోయిన 100 మంది రైతుల జాబితాను ప్రకటిస్తామన్నారు. 400 మంది రైతులు పోలీసుల అక్రమ కస్టడీలో ఉన్నట్లు సామాజిక హక్కుల కార్యకర్త సరాబ్జిత్ సింగ్ వెర్కా ఆరోపించారు. మొత్తం మీద ఢిల్లీ అల్లర్ల తర్వాత అరెస్టులు, నిర్భందాల్లో ఉన్న రైతులు కాకుండా వందమంది రైతులు కనిపించటం లేదన్న విషయం ఇపుడు సంచలనంగా మారింది. చూద్దాం వీళ్ళ ఆచూకీ ఎప్పుడు బయటపడుతుందో.

This post was last modified on January 31, 2021 1:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

17 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

51 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago