రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని సీన్ ఒకటి కనిపించింది. అందుకు టీడీపీకి చెందిన యువ ఎంపీ కారణంగా కావటం విశేషం. సాధారణంగా విదేశాల్లో పెటర్నిటీ లీవ్ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. దేశీయంగా కొన్ని రంగాలకు చెందిన కార్పొరేట్ ప్రపంచంలో ఈ మాట వినిపిస్తుంది. రాజకీయాల్లో ఇలాంటి మాటలకు చోటు ఉండదు. అందుకు భిన్నంగా ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం లోక్ సభ బడ్జెట్ సమావేశాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 నుంచి మొదలైన పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల (ఫిబ్రవరి) వరకు సాగనున్నాయి. అయితే.. తనకు సెలవులు అవసరమని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు లేఖ రాశారు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. తనకు తొమ్మిది రోజుల పాటు పెటర్నిటీ లీవు కావాలని కోరారు. తన భార్య నిండు గర్భిణి అని.. పది రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందని.. ఆ సమయంలో ఆమె వద్ద ఉండటం అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కారణంతోనే తాను బడ్జెట్ సమావేశాలకు పాల్గొనటం లేదన్నారు. ఈ కారణంగానే తనకు సెలవులు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా భయాందోళనలు ఉన్న నేపథ్యంలో.. పుట్టిన బిడ్డ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్న రామ్మోహన్ నాయుడు.. బయట తిరిగి పిల్లాడి దగ్డరకు వెళితే ఇబ్బంది ఉంటుందన్నారు. పిల్లల బాధ్యత తల్లిదే కాదని.. తనది కూడా సమాన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తనకు సెలవు కావాలని కోరారు.
ఇంత సున్నితంగా ఆలోచించే రాజకీయ నేతలు చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. పెటర్నిటీ లీవు ద్వారా కొత్త విధానానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు తెర తీశారని చెప్పక తప్పదు. ఏమైనా.. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న రాజకీయ నేత.. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని అనుకోవటం ప్రశంసించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.
This post was last modified on January 30, 2021 11:16 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…
వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో…
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…