Political News

స్పీకర్ కు పెటర్నిటీ లీవ్ పెట్టుకున్న టీడీపీ ఎంపీ ఎవరంటే?

రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని సీన్ ఒకటి కనిపించింది. అందుకు టీడీపీకి చెందిన యువ ఎంపీ కారణంగా కావటం విశేషం. సాధారణంగా విదేశాల్లో పెటర్నిటీ లీవ్ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. దేశీయంగా కొన్ని రంగాలకు చెందిన కార్పొరేట్ ప్రపంచంలో ఈ మాట వినిపిస్తుంది. రాజకీయాల్లో ఇలాంటి మాటలకు చోటు ఉండదు. అందుకు భిన్నంగా ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం లోక్ సభ బడ్జెట్ సమావేశాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 నుంచి మొదలైన పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల (ఫిబ్రవరి) వరకు సాగనున్నాయి. అయితే.. తనకు సెలవులు అవసరమని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు లేఖ రాశారు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. తనకు తొమ్మిది రోజుల పాటు పెటర్నిటీ లీవు కావాలని కోరారు. తన భార్య నిండు గర్భిణి అని.. పది రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందని.. ఆ సమయంలో ఆమె వద్ద ఉండటం అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కారణంతోనే తాను బడ్జెట్ సమావేశాలకు పాల్గొనటం లేదన్నారు. ఈ కారణంగానే తనకు సెలవులు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా భయాందోళనలు ఉన్న నేపథ్యంలో.. పుట్టిన బిడ్డ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్న రామ్మోహన్ నాయుడు.. బయట తిరిగి పిల్లాడి దగ్డరకు వెళితే ఇబ్బంది ఉంటుందన్నారు. పిల్లల బాధ్యత తల్లిదే కాదని.. తనది కూడా సమాన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తనకు సెలవు కావాలని కోరారు.

ఇంత సున్నితంగా ఆలోచించే రాజకీయ నేతలు చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. పెటర్నిటీ లీవు ద్వారా కొత్త విధానానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు తెర తీశారని చెప్పక తప్పదు. ఏమైనా.. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న రాజకీయ నేత.. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని అనుకోవటం ప్రశంసించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.

This post was last modified on January 30, 2021 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

2 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

3 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

4 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago