జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగాను ఉంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటయ్యా అంటే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ పేరుతో జనసేన పార్టీ తరపున షాడో కమిటిలు ఏర్పాటయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించమే విచిత్రంగా ఉంది. అసలు తాము ఏమి చేస్తున్నారో నేతలకు అర్ధమవుతోందా అన్న సందేహాలు జనాల్లో పెరిగిపోతున్నాయి.
దేవాలయాల నిర్వహణ, దేవాలయాల ఆస్తుల పరిరక్షణ అన్నది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన పని. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులకు జనసేన పార్టీ తరపున షాడో కమిటిని ఎలా నియమిద్దామని అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. అసలు షాడో కమిటిలను ఏర్పాటు చేసి పవన్ ఏమి సాదిద్దామని అనుకుంటున్నారు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా దేవాలయాలకు పాలకవర్గాలున్నాయి. కొంతకాలంగా దేవాలయాలపై జరుగుతున్న ఘటనలన్నీ ప్రముఖ దేవాలయాలు కావు. ఒక్క విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని సింహవాహనం వెండి సింహాలు మాయమవటం తప్ప మిగిలినవన్నీ మారుమూల దేవాలయాలే. సరే దేవాలయం ఎక్కడున్నా పవిత్రమే కాబట్టి వాటి పరిరక్షణకు ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. సుమారు 45 వేల దేవాలయాలకు ఇప్పటికే కెమెరాలు ఏర్పాటయ్యాయి.
దేవాలయాల నిర్వహణ, దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు పాలకవర్గాలు, అధికార యంత్రాంగం ఉంది. మరి జనసేన నియమించిన షాడో కమిటిలు ఏమి చేస్తాయి ? అనవసరంగా షాడో కమిటిలు ఓవర్ యాక్షన్ చేయటం, వాటితో పాలకవర్గాలకు లేదా అధికార యంత్రాంగానికి మధ్య గొడవలు అవటం తప్ప జరిగేదేమీ లేదు. మరి పవన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల వల్ల లేనిపోని తలనొప్పులు మొదలవ్వటమే తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు. మరి షాడో కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…